BJP Election Committee: జమ్ముకశ్మీర్‌ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా కిషన్ రెడ్డి, బీజేపీ ఎన్నికల కమిటీ కీలక నిర్ణయం

BJP Appoints Elections Incharges For Assembly Polls In Maharashtra Haryana Jharkhand Jk
x

BJP Election Committee: జమ్ముకశ్మీర్‌ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా కిషన్ రెడ్డి, బీజేపీ ఎన్నికల కమిటీ కీలక నిర్ణయం

Highlights

BJP Election Committee: జమ్ము కశ్మీర్‌కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియామకం

BJP Election Committee: మహారాష్ట్ర ,జార్కండ్, హరియాణా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాలకు బీజేపీ అధిష్ఠానం ఇంఛార్జీలను ప్రకటించింది. జమ్ముకశ్మీర్ ఎన్నికల ఇంఛార్జీగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నియమించింది. మహారాష్ట్ర ఇంఛార్జీగా భూపేంద్ర యాదవ్, కో ఇంఛార్జీగా అశ్విని వైష్ణవ్‌ను నియమించగా... హరియాణా బాధ్యతలను ధర్మేంద్ర ప్రధాన్, బిప్లబ్ కుమార్‌దేవ్‌లకు అప్పగించింది. ఇక జార్ఖండ్ బాధ్యతలను శివరాజ్ సింగ్ చౌహాన్‌తో పాటు హిమంత బిశ్వ శర్మలను నియమించినట్లు ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories