Alai Balai 2024: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రారంభమైన అలయ్ బలయ్

Alai Balai 2024: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రారంభమైన అలయ్ బలయ్
x

Alai Balai 2024: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రారంభమైన అలయ్ బలయ్

Highlights

Alai Balai 2024: అలయ్ బలయ్ కార్యక్రమం ఆదివారం నాంపల్లి ఎగ్జిభిషన్ గ్రౌండ్స్ లో జరిగింది.

Alai Balai 2024: అలయ్ బలయ్ కార్యక్రమం ఆదివారం నాంపల్లి ఎగ్జిభిషన్ గ్రౌండ్స్ లో జరిగింది. ప్రతి ఏటా దసరా సందర్భంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గతంలో ఈ కార్యక్రమాన్ని మాజీ కేంద్రమంత్రి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించేవారు. ప్రస్తుతం దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అందరిని ఒకే వేదికపైకి తీసుకొచ్చి అలయ్ బలయ్ జరుపుకుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం కోసం అందరిని ఏకం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హర్యానా, తెలంగాణ, ఉత్తరాఖండ్ గవర్నర్లు బండారు దత్తాత్రేయ, జిష్ణుదేవ్ వర్మ, గుర్మిత్ సింగ్, ఎమ్మెల్సీ కోదండరామ్ సహా పలు పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories