Kamareddy: కామారెడ్డి జిల్లాలోని గిరిపుత్రికకు అరుదైన అవకాశం

A Rare Opportunity For Giriputrika In Kamareddy District
x

Kamareddy: కామారెడ్డి జిల్లాలోని గిరిపుత్రికకు అరుదైన అవకాశం

Highlights

Kamareddy: ప్రధాని నరేంద్ర మోడీ, లోకసభ స్పీకర్ ఓంప్రకాష్ బిర్లాతో ప్రశంసలు అందుకున్న మౌనిక

Kamareddy: కామారెడ్డి జిల్లాలోని ఓ గిరి పుత్రికకు అరుదైన అవకాశం లభించింది. గుడ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియా దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా పోచారం గ్రామానికి చెందిన కేతావత్ మౌనిక పార్లమెంట్ సెంటర్ హాల్లో ప్రసంగించి అందరినీ మంత్ర ముగ్ధులను చేసింది. దివంగత మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి జీవిత చరిత్రపై అనర్గళంగా ప్రసంగించి, ప్రధాని నరేంద్ర మోడీ, లోకసభ స్పీకర్ ఓంప్రకాష్ బిర్లాతో ప్రశంసలు అందుకున్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి ఎదిగి, సమాజ అభివృద్ధికి పాటుపడటంతోపాటు సివిల్స్ సాధించడమే లక్ష్యం అంటోంది మౌనిక పట్టుదల, అనుకున్న లక్ష్యంవైపు పరుగులు తీస్తున్న కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎం ఎస్ డబ్ల్యూ మొదటి సంవత్సరం చదువుతున్న కేతావత్ మౌనిక.

Show Full Article
Print Article
Next Story
More Stories