Rohit Sharma: ఆ కుర్రాడి ఎంట్రీతో రోహిత్ బెస్ట్ ఫ్రెండ్ ఔట్.. 6 ఏళ్లుగా నో ఛాన్స్.. కెరీర్ ఖతం..
Rohit Sharma: రోహిత్ శర్మ కారణంగా, టీమిండియా శక్తివంతమైన బ్యాట్స్మెన్ టెస్ట్ కెరీర్ దాదాపు ముగిసింది.
Rohit Sharma: రోహిత్ శర్మ కారణంగా, టీమిండియా శక్తివంతమైన బ్యాట్స్మెన్ టెస్ట్ కెరీర్ దాదాపు ముగిసింది. ఈ బ్యాట్స్మెన్ మరెవరో కాదు రోహిత్ శర్మకు బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు ఈ బ్యాట్స్మెన్ తిరిగి టెస్టు జట్టులోకి వస్తాడని ఊహించడం కష్టమే. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సెలెక్టర్లు ఇప్పుడు ఈ ఆటగాడికి టెస్ట్ జట్టులో స్థానం గురించి ఆలోచించడమే మర్చిపోయారు. ఆరేళ్లుగా ఈ ఆటగాడికి టెస్టు క్రికెట్లో ఆడే అవకాశం రావడం లేదు. సెలక్టర్లు విస్మరిస్తున్న బ్యాట్స్మన్ రోహిత్ శర్మ వంటి తుఫాను బ్యాటింగ్లో నిపుణుడు కావడం గమనార్హం.
రోహిత్ కారణంగానే అతడి బెస్ట్ ఫ్రెండ్ కార్డ్ కట్..
ఒకప్పుడు శిఖర్ ధావన్ను టీమ్ ఇండియా బిగ్ మ్యాచ్ విన్నర్గా భావించేవారు. కానీ, ఇప్పుడు శిఖర్ ధావన్ టెస్ట్ కెరీర్లో రోహిత్ శర్మ అతిపెద్ద అడ్డంకిగా మారాడు. చాలా కాలంగా శిఖర్ ధావన్కు సెలక్టర్లు టెస్టు జట్టులో అవకాశం ఇవ్వడం లేదు. రోహిత్ శర్మ టెస్ట్ కెప్టెన్ అయిన తర్వాత, అతనిని ఓపెనింగ్ స్థానం నుంచి తొలగించడం కష్టం. రోహిత్ శర్మతో పాటు, యశస్వి జైస్వాల్ ఇప్పుడు టెస్ట్ జట్టులో ఎడమ చేతి ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా అవకాశం పొందాడు. ఇప్పుడు శిఖర్ ధావన్ కోసం టెస్టు జట్టు తలుపులు మూసుకుపోయాయని భావిస్తున్నారు.
టెస్ట్ కెరీర్లో బ్రేక్..
శిఖర్ ధావన్ చివరిసారిగా 2018లో భారత్ తరపున టెస్టు ఆడాడు. శిఖర్ ధావన్ గణాంకాలను పరిశీలిస్తే, అతను క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో అగ్రశ్రేణి ఆటగాడిగా కనిపిస్తాడు. టెస్టు క్రికెట్లో శిఖర్ ధావన్ 34 మ్యాచ్ల్లో 40.61 సగటుతో 2315 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్లో శిఖర్ ధావన్ 7 సెంచరీలు చేసినా సెలక్టర్లు అతడిని సరిగ్గా అంచనా వేయలేదని తెలుస్తోంది.
రోహిత్తో సూపర్హిట్ జోడీ సెట్..
2013 ఛాంపియన్స్ ట్రోఫీలో తొలిసారిగా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్లను ఓపెనర్గా రంగంలోకి దించాడు. అప్పటి నుంచి వీరిద్దరూ భారత బ్యాటింగ్కు పునాదిలా మారారు. వీరిద్దరూ కలిసి టాప్ ఆర్డర్లో చాలా పరుగులు చేశారు. రోహిత్తో పాటు ధావన్ ప్రపంచంలోని ప్రతి మైదానంలో పరుగులు సాధించాడు.
ధావన్ కెరీర్..
శిఖర్ ధావన్ ఒకప్పుడు భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్కు బలమైన మూల స్థంభంలా నిలిచాడు. కానీ, కాలంతో పాటు కథ మారిపోయింది. అతను భారత్ తరపున మూడు ఫార్మాట్లలో క్రికెట్ ఆడాడు. ధావన్ 34 టెస్టుల్లో 2315 పరుగులు, 167 వన్డేల్లో 6793 పరుగులు, 68 టీ20 మ్యాచుల్లో 1759 పరుగులు చేశాడు. అతను గత 6 సంవత్సరాలుగా టెస్టు జట్టుకు దూరంగా ఉన్నాడు. శిఖర్ ధావన్ 2018 నుంచి టెస్ట్ క్రికెట్ ఆడలేదు. ఆ తర్వాత అతనికి ఏ టెస్ట్ సిరీస్లో ఆడే అవకాశం ఇవ్వలేదు. ఇదంతా చూస్తుంటే టెస్టు క్రికెట్లో ధావన్కి ఇప్పుడు తలుపులు మూసుకుపోయాయని అర్థమవుతోంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire