Paris Olympics 2024: గోల్డ్ మెడలిస్ట్​తో లక్ష్యసేన్ పోటీ..

Paris Olympics 2024 Lakshya Sen Creates History
x

Paris Olympics 2024: గోల్డ్ మెడలిస్ట్​తో లక్ష్యసేన్ పోటీ..

Highlights

Paris Olympics 2024: భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ పారిస్ ఒలింపిక్స్‌లో జోరుమీదున్నాడు. సూపర్ ఫామ్​తో సెమీఫైనల్​కు దూసుకెళ్లాడు.

Paris Olympics 2024: భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ పారిస్ ఒలింపిక్స్‌లో జోరుమీదున్నాడు. సూపర్ ఫామ్​తో సెమీఫైనల్​కు దూసుకెళ్లాడు. ఈ క్రమంలో ఒలింపిక్స్ పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్​ఈవెంట్లో సెమీస్ ఫైనల్​కు అర్హత సాధించిన తొలి భారత​షట్లర్​గా లక్ష్యసేన్ చరిత్ర సృష్టించాడు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్​లో తైవాన్ షట్లర్ చో చెన్‌ పై విజయం సాధించి పతకానికి అడుగు దూరంలో నిలిచాడు. ఇక రాబోయే మ్యాచ్​ల్లో కూడా ఇలాగే అదరగొట్టి పతకాన్ని పట్టేయాలని భారత్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

కీలమైన సెమీస్​పోరులో లక్ష్యసేన్ డెన్మార్క్ షట్లర్ విక్టర్ ఆక్సెల్సెన్ తో తలపడనున్నాడు. ఆక్సెల్సెన్​కూడా ఈ ఒలింపిక్స్​లో ఓటమి లేకుండా సెమీస్​కు దూసుకొచ్చాడు. అతడు గ్రూప్ స్టేజ్​లో నేపాల్, ఇజ్రాయెల్, ఐర్లాండ్ ప్లేయర్లపై గెలిచాడు. కాగా, క్వార్టర్ ఫైనల్​లో సింగపుర్ షట్లర్ కే వై లోక్​పై విజయం సాధించి జోరుమీదున్నాడు. అంతేకాకుండా 2020 ఒలింపిక్స్ పరుషుల బ్యాట్మింటన్ సింగిల్స్​లో విక్టర్ ఆక్సెల్సెన్ స్వర్ణ పతకం దక్కించుకున్నాడు. దీంతో సెమీఫైనల్​లో లక్ష్యసేన్​కు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది.

రేపు జరగనున్న సెమీస్​లో లక్ష్యసేన్ విజయం సాధిస్తే పతకం ఖరారవుతుంది. అతడు ఫైనల్​పోరులో స్వర్ణ పతకం కోసం పోటీపడాల్సి ఉంటుంది. ఒకవేళ సెమీ ఫైనల్​లో లక్ష్య ఓడితే కాంస్యం కోసం ఆడాల్సి ఉంటుంది. కాగా, ఈ ఒలింపిక్స్‌లో భారత స్టార్ ప్లేయర్లు పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ నిరాశపర్చారు. ప్రీ క్వార్టర్స్‌లో సింధు ఓడగా, క్వార్టర్స్‌లో సాత్విక్- చిరాగ్ శెట్టి జోడీ నిష్క్రమించింది. దీంతో భారతీయుల అంచనాలన్నీ ఆశలన్నీ లక్ష్యసేన్‌పైనే నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా లక్ష్యసేన్ సెమీస్‌కు చేరాడు. ఇదే జోరును సెమీస్‌లో కొనసాగిస్తే.. పతకం గ్యారెంటీగా తీసుకొచ్చే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories