IND vs ZIM: జింబాబ్వే టూర్‌కు భారత యువ జట్టు.. తెలుగబ్బాయికి చోటు.. కెప్టెన్‌ ఎవరో తెలుసా?

India’s squad for tour of Zimbabwe announced Shubman Gill as a new T20I captain
x

IND vs ZIM: జింబాబ్వే టూర్‌కు భారత యువ జట్టు.. తెలుగబ్బాయికి చోటు.. కెప్టెన్‌ ఎవరో తెలుసా?

Highlights

IND vs ZIM: అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టుకు తొలిసారిగా శుభ్‌మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్‌నకు టీమిండియా రిజర్వ్‌గా ఎంపికయ్యాడు. కానీ, గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ల తర్వాత అతను భారత్‌కు తిరిగి వచ్చేశాడు.

India’s squad for tour of Zimbabwe: టీ20 ప్రపంచకప్‌ 2024 ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇందులో ఐపీఎల్ 2024 నుంచి మెరిసిన ఐదుగురు స్టార్లకు అవకాశం దక్కింది. వీరిలో అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, తుషార్ దేశ్ పాండేలకు చోటు దక్కింది. టీ20 ప్రపంచకప్ 2024లో ఆడుతున్న టీమిండియా నుంచి కేవలం ఇద్దరికే చోటు దక్కింది. వీరిలో యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ పేర్లు కూడా ఉన్నాయి. ఈ టోర్నీలో రిజర్వ్‌లో చేరిన రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ కూడా జింబాబ్వేకు వెళ్లనున్నారు. జులై 6 నుంచి భారత్-జింబాబ్వే మధ్య సిరీస్ ప్రారంభం కానుంది.

అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టుకు తొలిసారిగా శుభ్‌మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్‌నకు టీమిండియా రిజర్వ్‌గా ఎంపికయ్యాడు. కానీ, గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ల తర్వాత అతను భారత్‌కు తిరిగి వచ్చేశాడు. అతనితో పాటు రుతురాజ్ గైక్వాడ్, జైస్వాల్, శాంసన్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు బ్యాట్స్‌మెన్‌గా ఉన్నారు. ఫాస్ట్ బౌలింగ్‌లో అవేశ్ ఖాన్, ఖలీల్, ముఖేష్ కుమార్, తుషార్ ఉన్నారు. లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కాగా, వాషింగ్టన్ సుందర్ మాత్రమే ఆఫ్ స్పిన్నర్‌గా ఎంపికయ్యాడు. శాంసన్, జురెల్ వికెట్ కీపర్లుగా ఎంపికయ్యారు.

జింబాబ్వే పర్యటనలో భారత జట్టు..

శుభమన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, ర్యాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ , తుషార్ దేశ్‌పాండే.

Show Full Article
Print Article
Next Story
More Stories