IND vs BAN 2nd Test: వర్షం కారణంగా కాన్పూర్ టెస్ట్ రద్దయితే.. భారత్‌కు భారీ నష్టం.. కారణమేంటో తెలుసా?

IND vs BAN 2nd Test
x

IND vs BAN 2nd Test: వర్షం కారణంగా కాన్పూర్ టెస్ట్ రద్దయితే.. భారత్‌కు భారీ నష్టం.. కారణమేంటో తెలుసా?

Highlights

IND vs BAN WTC Points Table: కాన్పూర్‌లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌లో వర్షం ఇరుజట్లతో ఓ ఆట ఆడుకుంటోంది.

IND vs BAN WTC Points Table: కాన్పూర్‌లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌లో వర్షం ఇరుజట్లతో ఓ ఆట ఆడుకుంటోంది. కాన్పూర్ టెస్టు తొలిరోజు శుక్రవారం 35 ఓవర్లు మాత్రమే ఆడగలిగారు. టెస్టు మ్యాచ్ రెండో రోజు శనివారం కూడా వర్షం బీభత్సం సృష్టించింది. ఈరోజు వాతావరణ సూచన కూడా ఆశాజనకంగా లేదు. అంటే, శనివారం కాన్పూర్‌లో వర్షం కురిసింది. దీంతో రెండో రోజు ఆట కూడా పాడైంది. టెస్ట్ మ్యాచ్ మూడో రోజు 59 శాతం వరకు వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో రెండో టెస్ట్ మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్ లేదా డ్రా అయ్యే ఛాన్స్ ఉంది.

కాన్పూర్ టెస్టు వాష్ అవుట్ అయితే భారత్‌కు ఎంత నష్టం?

కాన్పూర్ టెస్టు రెండో రోజు 80 శాతం, మూడో రోజు 59 శాతం వర్షం కురిస్తే.. మ్యాచ్ ఫలితాన్ని అందుకోవడం అసాధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో కాన్పూర్‌లో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగనున్న ఈ రెండో టెస్టు మ్యాచ్ కూడా డ్రా అయ్యే అవకాశం ఉంది. కాన్పూర్ టెస్ట్ మ్యాచ్ డ్రా అయితే, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ భారీ నష్టాన్ని చవిచూడవచ్చు. కాన్పూర్ టెస్టు డ్రా అయితే భారత్‌కు ఎంత నష్టం వాటిల్లుతుందో ఇప్పుడు చూద్దాం..

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో గందరగోళం..

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (2023-2025) ప్రస్తుత సైకిల్‌లో భారతదేశం ఇప్పటివరకు 10 టెస్ట్ మ్యాచ్‌లలో 7 గెలిచింది. భారత్ ఇప్పటి వరకు కేవలం 2 టెస్టుల్లో ఓటమి చవిచూడగా, ఒక మ్యాచ్ టై అయింది. భారత్ విజయాల శాతం 71.67గా ఉంది. కాన్పూర్ టెస్టు డ్రా కావడంతో భారత్ బంగ్లాదేశ్‌తో పాయింట్లు పంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ స్థితిలో భారత్, బంగ్లాదేశ్‌లు 4-4 పాయింట్లు పంచుకోవాల్సి ఉంటుంది. కాన్పూర్ టెస్టులో భారత్ గెలిస్తే 12 పాయింట్లు వస్తాయి. అంటే, టెస్టు మ్యాచ్ డ్రా అయితే భారత్ 8 పాయింట్లు కోల్పోవాల్సి వస్తుంది.

భారత్‌కు 68.18 శాతం పాయింట్లు..

కాన్పూర్ టెస్టు డ్రా కావడంతో భారత్‌కు 68.18 శాతం పాయింట్లు మిగిలాయి. అదే సమయంలో టెస్టు మ్యాచ్‌లో గెలిస్తే టీమిండియాకు 74.24 శాతం పాయింట్లు వస్తాయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ టిక్కెట్‌ను పొందాలంటే, భారత్ 9 టెస్ట్ మ్యాచ్‌లలో 5 గెలవాలి. బంగ్లాదేశ్‌తో కాన్పూర్ టెస్ట్ తర్వాత, భారత్ న్యూజిలాండ్‌తో 3 టెస్ట్ మ్యాచ్‌లు (హోమ్), ఆస్ట్రేలియాతో 5 టెస్ట్ మ్యాచ్‌లు (విదేశాల్లో) ఆడాల్సి ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC)లో ఫైనల్‌కు చేరాలంటే, భారత్ కాన్పూర్ టెస్టుతో సహా మొత్తం 9 టెస్ట్ మ్యాచ్‌లలో 5 గెలవాలి.

WTC ఫైనల్ ఆడేందుకు భారత్ బలమైన పోటీదారు..

రోహిత్ శర్మ సారథ్యంలోని టీం ఇండియా, 11 జూన్ 2025న లార్డ్స్‌లోని చారిత్రాత్మక మైదానంలో టెస్ట్ క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ అంటే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను ఆడేందుకు బలమైన పోటీదారుగా ఉంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఏ జట్టు టైటిల్‌ను గెలుస్తుందో ఆ జట్టుకే టెస్టు మ్యాక్‌ను అందజేస్తారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలవడం ఏ దేశానికైనా గర్వకారణం. రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ ఈ ఏడాది జూన్‌లో టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పుడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025లో ఫైనల్‌కు చేరుకుని ఈ అరుదైన టైటిల్‌ను గెలుచుకోవడం టీమిండియా తదుపరి భారీ టార్గెట్‌గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories