Live Updates: ఈరోజు (సెప్టెంబర్-23) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 23 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం | 23 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | సప్తమి: రా.1-49 తదుపరి అష్టమి | జ్యేష్ఠ నక్షత్రం రా.12-29 తదుపరి మూల | వర్జ్యం: ఉ.7-00 నుంచి 8-31 వరకు | అమృత ఘడియలు: సా.4-07 నుంచి 5-32 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-29 నుంచి 12-17 వరకు | రాహుకాలం: ఉ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-55
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 23 Sep 2020 12:04 PM GMT
Tirumala-Tirupati updates: ముఖ్యమంత్రిని కలిసిన రమణదీక్షితులు..
తిరుమల-తిరుపతి..
-ముఖ్యమంత్రిని కలిసిన రమణదీక్షితులు వంశపారంపర్య అర్చక కుటుంబ పెద్దలు
-సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి
-దర్శనానంతరం చర్చిద్దామని సూచించిన సియం
-మళ్ళీ కలవనున్న రమణదీక్షితులు
- 23 Sep 2020 12:00 PM GMT
Visakha updates: ఉప్పుటేరులో వెలసిన శివలింగాలు..
విశాఖ....
-పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం పంచాయతీ తిక్కవానిపాలెం సముద్రతీరాన గల ఉప్పుటేరులో శివలింగం,భైవవస్వామి,విష్టుమూర్తి,కుమారస్వామి విగ్రహాలు బయటపడ్డాయి.
-గ్రామ పెద్ద సూరాడ సత్తయ్యకు గత ఆరు నెలలుగా ఉప్పుటేరులో విగ్రహాలు ఉన్నట్టు కలలు వస్తున్నాయని గ్రామస్తులకు చెప్పినా ఇది మూడ నమ్మకని కొట్టిపారేసారు.
-సూరాడ సత్తయ్య కలలో విగ్రహరూపాలు కదలాడటంతో బుదవారం గ్రామస్తుల సహాయంతో ఉప్పుటేరులో గాలించగా విగ్రహాలు బయటపడ్డాయి.
-ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు తండోపతండాలుగా వచ్చి విగ్రహాలను తిలకించారు.
- 23 Sep 2020 11:47 AM GMT
CM Jagan Tour to Tirumala: రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి..
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి..
-రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
-ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం
-రోడ్డు మార్గాన తిరుమలకు పయనం
- 23 Sep 2020 11:33 AM GMT
Tirumala-Tirupati updates: తిరుమలలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని..
తిరుమల..
- జగన్మోహన్ రెడ్డి సతీసమేతంగా రావాలంటున్న బిజెపి నేతలు మోదీ రామాలయ శంఖు స్థాపనకు ఏ భార్యతో వచ్చారంటూ వ్యాఖ్య
- యోగి ఆదిత్యనాథ్ ఏ భార్యతో వచ్చారో చెప్పాలని చురక
- శ్రీకృష్ణదేవరాయలు ఎన్నో భార్యతో వచ్చారని వ్యంగ్య వ్యాఖ్యలు
- దేవస్థానం వారు పిలిస్తే వచ్చిన ముఖ్యమంత్రిని అవమానించేలా మాట్లాడటం భావ్యం కాదు..
- ఈ నిబంధన కరెక్ట్ కాదు.
- అందుకే ఎవరు పెట్టారో అని అడిగాను...
- 23 Sep 2020 11:26 AM GMT
East Godavari updates: మండపేట ఆర్.సి.ఎమ్ చర్చ్ లో విగ్రహాల ధ్వంసంపై కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు: తోట త్రిమూర్తులు..
తూర్పుగోదావరి -మండపేట..
- మాజీ ఎమ్మెల్యే , వైసీపీ మండపేట కో ఆర్డినేటర్ తోట త్రిమూర్తులు
- ఘటన స్థలంలో సుత్తిని స్వాధీనం చేసుకొని ఆధారాలు సేకరించిన క్లూస్ టీమ్
- విగ్రహాలు ధ్వంసమైన చర్చ్ ను సందర్శించిన మండపేట వై.సి.పి కోఆర్డినేటర్, పార్టీ పార్లమెంటు అధ్యక్షుడు తోట త్రిమూర్తులు
- మండపేటలో క్రైస్తవ విగ్రహాల ధ్వంసం ఆకతాయిల పని కాదు అసాంఘిక శక్తులు చేసినదే
- మతాల మధ్య ప్రశాంతమైన వాతావరణం చెడగొట్టి మా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు కుట్ర జరుగుతోంది
- ఘటనపై సి.ఎం జగన్ , డి.జి.పి.లు తక్షణమే స్పందించారు,
- దోషులు ఎవరైనా కఠిన శిక్ష తప్పదు
- 23 Sep 2020 11:16 AM GMT
Amaravati updates: విజయవాడలో ని బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ సుందరికరణ పనులకు 2 కోట్ల 75 లక్షల రూపాయలు మంజూరు చేసిన పురపాలక శాఖ..
అమరావతి..
-విజయవాడలో ని బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ సుందరికరణ పనులకు 2 కోట్ల 75 లక్షల రూపాయల ఖర్చు చేసేందుకు పరిపాలన అనుమతి మంజూరు చేసిన పురపాలక శాఖ
-ఫ్లై ఓవర్ దిగువన 1 నెంబర్ పిల్లర్ నుంచి 47 పిల్లర్ వరకు సుందరీ కరణ పనులు చేపట్టాలని నిర్ణయం
-ఎస్వీఎస్ కల్యాణ మండపం నుంచి గురునానక్ కాలనీ రోడ్ వరకు ల్యాండ్ స్కెప్ పనులు
-విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సాదారణ నిధుల నుంచి ఈ మొత్తం ఖర్చు చేయాలని ఆదేశాలు జారీ
- 23 Sep 2020 10:56 AM GMT
Amaravati updates: అక్టోబర్ 2 నుంచి 'మనం-మన పరిశుభ్రత' రెండోదశ..
అమరావతి..
- ప్రతి మండలానికి 5 నుంచి 10 గ్రామాలలో అమలు
- జూన్ 1న రాష్ట్రంలో ప్రారంభమైన మనం-మన పరిశుభ్రత
- జూలై 24 నుంచి 15 రోజుల పాటు పక్షోత్సవాలు
- దీనిలో భాగంగా 1320 గ్రామ పంచాయతీల్లో తొలిదశ కార్యక్రమాలు
- కోవిడ్-19 సమయంలో గ్రామాల్లో సత్ఫలితాలు ఇచ్చిన పక్షోత్సవాలు
- ప్రజా భాగస్వామ్యంతో పల్లెల్లో ఆరోగ్యకర వాతావరణం
- 70 శాతం సీజనల్ వ్యాధుల వ్యాప్తికి అడ్డుకట్ట
- ప్రజల నుంచి పంచాయతీలకు విరాళాలుగా రూ.1.72 కోట్లు జమ
- ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున రెండోదశ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపు
- ఈ మేరకు ప్రజాప్రతినిధులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేఖ
- 23 Sep 2020 10:53 AM GMT
Tirupati updates: ముఖ్యమంత్రి పర్యటనలో ఎయిర్ పోర్టులో ఆంక్షలు..
తిరుపతి..
- ముఖ్యమంత్రి పర్యటనలో ఎయిర్ పోర్టులో ఆంక్షలు
- మీడియాను సైతం దూరంగా పంపేసిన భద్రతా సిబ్బంది
- పోర్డికో నుంచి దూంరగా మీడియా
- 23 Sep 2020 10:43 AM GMT
Bakkani Narasimhulu Comments: డిక్లరేషన్ లేని పక్షంలో సనాతన ధర్మాన్ని తృణీకరించినట్లవుతుంది.. బక్కిని నరసింహులు..
టీటీడీ మాజీ బోర్డు సభ్యులు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బక్కిని నరసింహులు...
- తమిళనాడు నుండీ గొడుగులు పాదయాత్ర గా 10 రోజులు నడుస్తూ తిరుమలకు చేరి స్వామివారికి సమర్పిస్తారు...
- అదే రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించే ఆచారం ఉంది...
- తిరుమలలో అన్యమతస్థులు ,విదేశీయులు దర్శనార్థం వచ్చినప్పుడు దేవుని పై భక్తి ,విశ్వాసం ఉన్నట్లుగా డిక్లరేషన్ ఇచ్చే నియమము హిందూ సంప్రదాయం లో ఉంది...
- సీఎం జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన తరువాత నే పట్టువస్త్రాలు సమర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కార్యనిర్వాహక అధికారిని కోరుతున్న...
- తద్వారా రాష్ట్రానికి ,దేశానికి అరిష్టం అవుతుంది...
- 23 Sep 2020 10:31 AM GMT
Swami Paripoornananda Comments: ఏపీ లో దేవాలయాల పైన ఇన్ని దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి ఎందుకు మౌనం గా ఉన్నారు ..స్వామి పరిపూర్ణానంద ..
hmtv తో స్వామి పరిపూర్ణానంద ...
- నాని ఆంజనేయ స్వామిని బొమ్మ అని అంటాడు , రధాన్ని ఇంకేదో అంటాడు అతనికి విజ్ఞత లేదు ...
- 1810 లో నుండే తిరుపతి దేవాలయాల పై డిక్లరేషన్ ఉంది...
- ఏపీ లో వరుసగా దేవాలయాల పై దాడులు జరుగుతున్న ప్రభుత్వం నుండి సరైన విధంగా స్పందన లేదు..
- ఇప్పటికైనా డిక్లరేషన్ గురించి ముఖ్యమంత్రి చెప్పకపోతే తదుపరి కార్యాచరణ శాంతియుతంగా న్యాయబద్దంగా చేస్తాము...
- దేవాలయాలు కాపాడడానికి ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే పర్యటిస్తా..
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire