Last Railway Station: భారత్‌లో చివరి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా.. ఒక్క రైల్ కూడా ఆగదు.. ఎందుకో తెలుసా?

The Last Railway Station of India to Enter Into Bangladesh Where no Train Stop Check Full Details
x

Last Railway Station: భారత్‌లో చివరి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా.. ఒక్క రైల్ కూడా ఆగదు.. ఎందుకో తెలుసా?

Highlights

భారతదేశ రైలు నెట్‌వర్క్ 68,103 కిలోమీటర్లుగా ఉంది. ప్రతిరోజూ 13 వేలకు పైగా రైళ్లు పట్టాలపై నడుస్తున్నాయి. వేలాది రైల్వే స్టేషన్ల గుండా ఇవి ప్రయాణిస్తున్నాయి.

The Last Railway Station of India: భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ సుమారు 2 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. భారతదేశ రైలు నెట్‌వర్క్ 68,103 కిలోమీటర్లుగా ఉంది. ప్రతిరోజూ 13 వేలకు పైగా రైళ్లు పట్టాలపై నడుస్తున్నాయి. వేలాది రైల్వే స్టేషన్ల గుండా ఇవి ప్రయాణిస్తున్నాయి. భారతీయ రైల్వేల రైల్వే స్టేషన్లు వాటి వెనుకాల ఎన్నో కథలను కలిగి ఉంటాయి. అయితే భారతదేశంలోని చివరి రైల్వే స్టేషన్ గురించి మీకు తెలుసా?

బంగ్లాదేశ్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న భారతదేశపు చివరి రైల్వే స్టేషన్ పేరు సింగాబాద్ రైల్వే స్టేషన్. పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలోని హబీబ్‌పూర్ ప్రాంతంలో ఉన్న ఈ రైల్వే స్టేషన్ భారతదేశంలోని చివరి రైల్వే స్టేషన్‌గా పరిగణిస్తుంటారు. ఎందుకంటే దీని తర్వాత బంగ్లాదేశ్ సరిహద్దు ప్రారంభమవుతుంది.

బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ రైల్వే స్టేషన్ చారిత్రక ప్రాధాన్యతను కలిగి ఉంది. భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య గత సంబంధాలలో ఇది కీలక పాత్ర పోషించింది. స్వాతంత్య్రానికి ముందు, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ వంటి వ్యక్తులు ఢాకా వెళ్ళడానికి ఈ స్టేషన్ గుండా వెళ్ళేవారు.

కానీ, ఇప్పుడు రైల్వే స్టేషన్‌ నిర్మానుష్యంగా మారింది. ఇప్పుడు ఇక్కడ ప్రయాణీకుల కోసం ఏ రైలు ఆగదు. ఈ రైల్వే స్టేషన్ ఇప్పుడు గూడ్స్ రైళ్లకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇక్కడ నుంచి బంగ్లాదేశ్‌కు కొన్ని గూడ్స్ రైళ్లు నడుస్తాయి. ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ కేవలం వ్యాపారానికి మాత్రమే ఉపయోగపడుతోంది.

ఇక్కడ ఏ రైలు ఆగదు లేదా ప్రయాణీకులు ఎవరూ రారు. అందువల్ల ఈ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌లు నిర్జనంగా కనిపిస్తుంటాయి. టిక్కెట్ కౌంటర్లు కూడా మూసివేశారు. స్టేషన్‌లో కొంతమంది రైల్వే సిబ్బంది మాత్రమే ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories