PR Sreejesh's Son: నువ్వు నాతో ఇక్కడే ఉండిపో.. శ్రీజేష్ కుమారుడితో ప్రధాని మోదీ సరదా సంభాషణ

PM Modi interacts with PR Sreejesh's Son: ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో ప్రధాని మోదీ ఓ పిల్లాడితో సరదాగా సంభాషిస్తూ అతడిని ఆట పట్టిస్తుండటమే ఆ వీడియో వైరల్ అవ్వడానికి కారణమైంది. ఇంతకీ ఆ పిల్లాడు ఎవరు అనే కదా మీ సందేహం.. యస్ అక్కడికే వస్తున్నాం. ఇటీవల పారిస్‌లో ముగిసిన ఒలింపిక్స్ పోటీల్లో ఇండియాకు హాకీలో కాంస్య పతకం సాధించిన ఇండియన్ హాకీ లెజెండరీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ కుమారుడే ఈ వీడియోలో కనిపిస్తున్న బాలుడు. అతడి పేరు శ్రేయాన్ష్. ఈ వీడియోలో కనిపిస్తున్న వాళ్లు శ్రీజేష్ కుటుంబసభ్యులు. తన కుటుంబసభ్యులతో పాటు వెళ్లిన శ్రీజేష్‌ని ప్రధాని మోదీ సాదరంగా స్వాగతించడమే కాకుండా వారితో సరదాగా సంభాషించి కాసేపు వారికి ఆనందాన్ని పంచారు.

ఈ సందర్భంగా శ్రీజేష్ కుమారుడు శ్రేయాన్స్‌ని అక్కున చేర్చుకున్న ప్రధాని మోదీ.. " నిన్ను మీ నాన్న కొడతాడా " అని అడిగారు. అంతేకాకుండా " నువ్వు, మీ తమ్ముడు గొడవపడితే మీ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు " అంటూ అక్కడే ఉన్న శ్రీజేష్ కుమార్తెను ఆటపట్టించారు. చివర్లో శ్రీజేష్ కుటుంబానికి వీడ్కోలు పలుకుతూ శ్రేయాన్స్‌ని దగ్గరకు తీసుకున్న మోదీ.. " నువ్వు మీ కుటుంబసభ్యులకు బాయ్ చెప్పి ఇక్కడే నాతో ఉండిపో " అని ఆటపట్టించారు. దీంతో అందరి ముఖాల్లో నవ్వులు విరబూశాయి.

ఇంతటితో అయిపోలేదండోయ్.. వారికి అక్కడి నుండి సెండాఫ్ ఇవ్వడానికి ముందుగా శ్రేయాన్స్‌ని వెంటపెట్టుకుని వెళ్లిన ప్రధాని మోదీ.. అతడికి ఓ చాక్లెట్ తినిపించి మరింత సంతోషాన్ని పంచారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ప్రధాని మోదీని కలిసిన అనంతరం సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్న శ్రీజేష్ సైతం ఇవే విషయాలను తన పోస్టులో పేర్కొన్నారు. ప్రధాని మోదీ అంత బిజీ సమయంలోనూ ఆటగాళ్ల కోసం కొంత సమయం కేటాయించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని.. ఇది తనకు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు అవుతుంది అని శ్రీజేశ్ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఒలింపిక్స్‌లో జరిగిన చివరి మ్యాచ్‌తోనే తన క్రీడా జీవితానికి రిటైర్మెంట్ పలికిన పీఆర్ శ్రీజేశ్... త్వరలోనే ఇండియన్ హాకీ జట్టుకు కోచ్‌గా వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories