Viral Video: నువ్వేం టీచర్‌వి తల్లి.. స్కూల్లో పిల్లలతో ఏంటా పని అసలు..

Viral Video
x

Viral Video

Highlights

Viral Video: పవిత్రమైన టీచర్‌ వృత్తిని అపహాస్య చేస్తున్నారు. తాజాగా నెట్టింట ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌ అవుతోంది.

Viral Video: గురువు అంటే చీకటి నుంచి వెలుగులోకి నడిపించే గొప్ప వ్యక్తి అని చెబుతుంటారు. కానీ కొందరు మాత్రం ఆ వృత్తికే చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. పవిత్రమైన టీచర్‌ వృత్తిని అపహాస్య చేస్తున్నారు. తాజాగా నెట్టింట ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఓ టీచర్‌ చేసిన పని చూస్తే తిట్టకుండ ఉండలేరు. ఇంతకీ ఎవరా టీచర్‌.? ఆమె చేసిన పనెంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.


ఓ ప్రభుత్వ పాఠశాలో ఉపాధ్యాయురాలు నేలపై పడుకొని స్కూల్‌లో ఉన్న చిన్నరాలతో మసాజ్‌ చేయించుకుంటోంది. ఈ సంఘటన రాజస్థాన్‌ రాష్ట్రంలోని జైపూర్‌లో చోటు చేసుకుంది. జైపూర్ లోని కర్తర్ పూర్ లో ఉన్న ప్రభుత్వ హయ్యర్ ప్రైమరీ పాఠశాలలో ఉపాధ్యాయురాలు నేలపై పడుకుని ఇద్దరు విద్యార్థులచే మసాజ్ చేయించుకుంటుంది. ఆమె పడుకొని ఉండగా విద్యార్థులు తొక్కుతున్నారు.


దీనంతటినీ ఎవరో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇంతకేముందు దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఆ ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఈ సంఘటన తీవ్ర చర్చకు దారి తీయడంతో.. పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్పందించారు.

వైరల్ అయితున్న వీడియో తాను కూడా చూశానని టీచర్ అనారోగ్యంతో ఉండవచ్చని, తన పాదాలకు మసాజ్ చేయమని పిల్లలను అభ్యర్థించి ఉండవచ్చని ఆమె చెప్పుకొచ్చారు. పూర్తి విచారణ జరిపి నిజా, నిజాలు తెలియజేస్తామని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఒక టీచర్‌ ఇలా చేయడం ఏమాత్రం సరైంది కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories