Hydrogen Train: దేశంలో తొలి హైడ్రోజన్ రైలు సిద్ధం.. ఎప్పుడు, ఎక్కడ ప్రారంభం కానుందంటే?

1st hydrogen train trial expected in december 2024 in indian railway check full details
x

Hydrogen Train: దేశంలో తొలి హైడ్రోజన్ రైలు సిద్ధం.. ఎప్పుడు, ఎక్కడ ప్రారంభం కానుందంటే?

Highlights

Hydrogen Train: భారతీయ రైల్వే తన మొదటి హైడ్రోజన్ రైలును (Hydrogen Train) ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. అంతా సక్రమంగా జరిగితే డిసెంబర్ 2024లో టెస్టింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది

Hydrogen Train: దేశం త్వరలో మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభించేందుకు ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ రైలు (Hydrogen Train) కోసం మూడవసారి సేఫ్టీ ఆడిట్ నిర్వహించడానికి భారతీయ రైల్వేలు జర్మనీకి చెందిన TUV-SUDని నియమించుకుంది. దీంతో అధికారులు 2024 డిసెంబర్‌లో ట్రయల్ రన్ ప్రారంభించాలని భావిస్తున్నారు.

ట్రయల్ రన్ సజావుగా సాగితే జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, చైనా తర్వాత హైడ్రోజన్ రైళ్లను నడపబోతోన్న ఐదో దేశంగా భారత్ అవతరిస్తుంది. ఇది కాకుండా, ప్రభుత్వం ఐదు హైడ్రోజన్ ఇంధన సెల్ ఆధారిత టవర్ కార్లను అభివృద్ధి చేస్తోంది. ఈ రైలు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ట్రాక్‌పై నడుస్తుంది. నివేదిక ప్రకారం ఒక్కో టవర్ కారుకు దాదాపు రూ.10 కోట్లు ఖర్చవుతుందని అంచనా.

ఈమేరకు అధికారులు మాట్లాడుతూ, హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ చొరవ కింద, భారతీయ రైల్వేలు ఒక్కో రైలుకు సుమారు రూ. 80 కోట్ల అంచనా వ్యయంతో 35 రైళ్లను నిర్మిస్తాయని చెప్పారు. ఇది కాకుండా, వివిధ కొండ మార్గాల్లో ఒక్కో రూట్‌కు గ్రౌండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ.70 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు.

సిస్టమ్ ఇంటిగ్రేషన్ యూనిట్ బ్యాటరీ, రెండు ఫ్యూయల్ యూనిట్ సింక్రొనైజేషన్ టెస్టింగ్ విజయవంతంగా నిర్వహించామని వారు తెలిపారు. అదనంగా, ఇప్పటికే ఉన్న డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (DEMU) రేక్‌లపై అవసరమైన గ్రౌండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పాటు హైడ్రోజన్ ఇంధన కణాలను తిరిగి అమర్చడానికి పైలట్ ప్రాజెక్ట్ జరుగుతోంది.

దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ఉత్తర రైల్వేలోని జింద్-సోనిపట్ సెక్షన్‌లో నడపవచ్చని తెలుస్తోంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ప్రోటోటైప్ రైలును ఏకీకృతం చేయడానికి ప్రణాళిక రూపొందించినట్లు అధికారి తెలిపారు. రైలు కోసం హైడ్రోజన్ జింద్ వద్ద ఉన్న 1-మెగావాట్ (MW) పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ (PEM) ఎలక్ట్రోలైజర్ ద్వారా అందించనుంది.

గ్రీన్‌హెచ్ ఎలక్ట్రోలిసిస్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ ఎలక్ట్రోలైజర్ నిరంతరం పని చేస్తుంది. దీని కారణంగా రోజుకు సుమారు 430 కిలోల హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుంది. జింద్‌లో 3,000 కిలోల హైడ్రోజన్ స్టోరేజ్, హైడ్రోజన్ కంప్రెసర్‌తో కూడిన రెండు హైడ్రోజన్ డిస్పెన్సర్‌లు, రైలుకు ఇంధనం నింపడానికి ప్రీ-కూలర్ ఇంటిగ్రేషన్ కూడా ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories