Tamil Nadu: కళ్లకురిచి కల్తీసారా కేసులో పెరుగుతున్న మృతులు

The death toll in Kallakurichi Toxic Alcohol case is increasing
x

Tamil Nadu: కళ్లకురిచి కల్తీసారా కేసులో పెరుగుతున్న మృతులు

Highlights

Tamil Nadu: కల్తీసారా తాగి ఇప్పటివరకు 61 మంది మృతి

Tamil Nadu: తమిళనాడు కళ్లకురిచి జిల్లా కరుణాపురంలో కల్తీసారా ఘటనలో మృతుల సంఖ్య 61కి చేరింది. సుమారు 118 మంది బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా కల్తీ మద్యం ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ NHRC సుమోటోగా కేసును స్వీకరించింది. తమిళనాడు సీఎస్, డీజీపీలకు NHRC నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై వివరణాత్మక నివేదిక ఇవ్వాలని కోరింది. కల్తీ సారా ఘటనలో ఆరుగురు మహిళలు మృతిచెందడంపై జాతీయ మహిళా కమిషన్ NCW స్పందించింది. కమిటీ సభ్యురాలైన ఖుష్బు సుందర్ కర్లకురిచి పీఎస్‌కి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బాధితులను ఖుష్బు పరామర్శించారు. బాధితుల్లో దళితులు ఉండటంతో జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కిషోర్ కుమార్ మక్వానా కరుణాపురంలో పర్యటించారు. బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories