Surat: సూరత్‌లో బిల్డింగ్ కూలిన ఘటనలో ఏడుకు చేరిన మృతులు

Seven People Died In A Building Collapse In Surat
x

Surat: సూరత్‌లో బిల్డింగ్ కూలిన ఘటనలో ఏడుకు చేరిన మృతులు

Highlights

Surat: శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

Surat: గుజరాత్‌లోని సూరత్‌లో ఉన్న సచిన్ పాలి గ్రాంలో శనివారం ఆరంతస్తుల బిల్డింగ్ కుప్పకూలిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ప్రమాదంలో మరో 15 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. 2017లో నిర్మించిన అపార్ట్‌మెంట్ బిల్డింగ్ అనూహ్యంగా ఇప్పటికే శిథిలావస్థకు చేరుకుంది. బిల్డింగ్‌లో 30 ప్లాట్లు ఉండగా ప్రస్తుతం అందులో ఐదు కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గత కొన్నిరోజులుగా అక్కడ కురుస్తోన్న భారీ వర్షాల కారణంగానే బిల్డింగ్ నానడంతో ఒక్కసారిగా కుప్పకూలినట్లు పోలీసులు స్పష్టం చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. భారీ ప్రొక్లైన్లతో శిథిలాలను తొలగిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories