Madhabi Puri Buch: మరోసారి వార్తల్లో నిలిచిన సెబీ చీఫ్‌ మాధబి పురీ బుచ్‌

SEBI chief Madhabi Puri Buch is in the news once again
x

Madhabi Puri Buch: మరోసారి వార్తల్లో నిలిచిన సెబీ చీఫ్‌ మాధబి పురీ బుచ్‌ 

Highlights

Madhabi Puri Buch: ఆమెపై తీవ్ర ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌

Madhabi Puri Buch: సెబీ చీఫ్‌ మాధబి పురీ బుచ్‌ మరోసారి వివాదంలో నిలిచారు. ఆమెపై కాంగ్రెస్‌ తీవ్ర ఆరోపణలు చేసింది. సెబీ ఛైర్‌పర్సన్‌గా ఉంటూ.. ఆమె ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి వేతనం తీసుకుంటున్నారంటూ ఆరోపించింది. ఇది పరస్పర విరుద్ధ ప్రయోజనాలకిందకే వస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ నేత పవన్‌ ఖేడా వ్యాఖ్యానించారు. ఇది ప్రజా సేవల్లో నైతికత, జవాబుదారీతనాన్ని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు.

ఒక కంపెనీలో పనిచేస్తూ ఒకచోట మాత్రమే వేతనం తీసుకోవాల్సి ఉంటుందని పవన్‌ అన్నారు. అలాంటిది సెబీ చీఫ్‌ విషయంలో అలా జరగడం లేదన్నారు. సెబీ పూర్తికాల సభ్యురాలిగా ఉన్న మాధబి ఐసీఐసీఐ బ్యాంక్‌, ప్రుడెన్షియల్‌ నుంచి వేతనం అందుకుంటున్నారని ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories