Rahul Gandhi: అస్సాం, మణిపూర్ రాష్ట్రాల్లో పర్యటించిన రాహుల్ గాంధీ

Rahul Gandhi toured the states of Assam and Manipur
x

Rahul Gandhi: అస్సాం, మణిపూర్ రాష్ట్రాల్లో పర్యటించిన రాహుల్ గాంధీ

Highlights

Rahul Gandhi: అస్సాంలో వరద బాధితులను పరామర్శించిన రాహుల్

Rahul Gandhi: మణిపుర్, అస్సాం రాష్ట్రాలలో లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ పర్యటించారు. ఢిల్లీ నుంచి ఇంఫాల్ వెళ్లిన రాహుల్‌కి కాంగ్రెస్ శ్రేణులు స్వాగతం పలికాయి. అస్సాంలో వరదలు, కొండచరియలు విరిగిపడిన కారణంగా 78 మంది ప్రాణాలు కోల్పోయారు. కామ్‌రూప్‌, నాగౌన్‌, కచార్‌, ధుబ్రి, గోల్‌పరా, మెరిగావ్‌, హైలాకండి, దక్షిణ సల్మార, దిబ్రూగఢ్‌ సహా పలు జిల్లాలు వరదల దెబ్బకు అతలాకుతలం అయ్యాయి. ముంపు ప్రాంత ప్రజలను అస్సాం ప్రభుత్వం పునరావాస కేంద్రాలకు తరలించింది.

పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలను రాహుల్ పరామర్శించారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇక మరోవైపు హింసతో అట్టుడికిన మణిపుర్‌లోనూ రాహుల్ పర్యటించారు. జిబామ్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. చురాచాంద్‌పుర్‌, మోయిరాంగ్‌లో శిబిరాలను సందర్శించి బాధితులను పరామర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories