PM Modi: పోలెండ్‌ పర్యటనకు వెళ్లిన మోడీకి ఘన స్వాగతం

PM Modi traditional welcome from Indian diaspora in Poland
x

PM Modi: పోలెండ్‌ పర్యటనకు వెళ్లిన మోడీకి ఘన స్వాగతం

Highlights

PM Modi: పర్యటన సందర్భంగా భారత సంతతి వ్యక్తులను కలిసిన మోడీ

PM Modi: యూరప్ కంట్రీ పోలెండ్‌ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. ఆ దేశ అధినేతలు సాదర స్వాగతం పలికింది. పర్యటన సందర్భంగా భారత సంతతి వ్యక్తులను కలుసుకున్నారు మోడీ. రెండు రోజుల పాటు మోడీ అక్కడ పర్యటించి.. ద్వైపాక్షి చర్చలు జరుపుతారు. గత 45ఏళ్లలో భారత ప్రధాని పోలెండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. పోలెండ్‌లో పర్యటన అనంతరం మోడీ.. అక్కడ నుంచి ఉక్రెయిన్‌ వెళ్లనున్నారు. ఆగస్టు 23న ప్రత్యేక రైలులో సుమారు 10 గంటలు ప్రయాణించి కీవ్‌ చేరుకుంటారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమై తిరిగి మళ్లీ రైలు మార్గంలోనే పోలెండ్‌ చేరుకుంటారు. అనంతరం పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగొస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories