PM Modi: 45 గంటల ధ్యానానికి కూర్చున్న ప్రధాని మోడీ

PM Modi in 45 Hour Meditation Session in Kanyakumari
x

PM Modi: 45 గంటల ధ్యానానికి కూర్చున్న ప్రధాని మోడీ

Highlights

గురువారం సాయంత్ర కన్యాకుమారికి చేరుకున్న ప్రధాని మోడీ అక్కడ భగవతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Kanyakumari: చివరి విడత ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసిన నేపథ్యంలో ప్రధాని మోడీ కన్యాకుమారిలో 45 గంటల ధ్యానానికి కూర్చున్నారు. రేపు ఏడో దశ పోలింగ్ ముగిసే వరకు ఆయన ధ్యాన ముద్రలోనే ఉండనున్నారు. గురువారం సాయంత్ర కన్యాకుమారికి చేరుకున్న ప్రధాని మోడీ అక్కడ భగవతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

తెల్లటి ధోవతి, శాలువా ధరించి అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం అక్కడ నుంచి ఫెర్రీలో కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్ వద్దకు చేరుకున్నారు. 2019లో కూడా మే 19న తుది దశ పోలింగ్ జరిగింది. ఎన్నికల ప్రచారం ముగిశాక మే 18న మోడీ కాషాయ శాలువా ధరించి కేదార్‌నాథ్‌లోని రుద్రగుహలో 17 గంటలపాటు ధ్యానం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories