PM Modi: 'నాన్న కొడతారా... తమ్ముడితో గొడవపడతావా?': శ్రీజేష్ పిల్లలతో మోదీ సరదా కబుర్లు...

PM Modi Fun Chat with PR Sreejesh Children
x

PM Modi: 'నాన్న కొడతారా... తమ్ముడితో గొడవపడతావా?': శ్రీజేష్ పిల్లలతో మోదీ సరదా కబుర్లు...

Highlights

PM Modi: 'నాన్న కొడతారా... తమ్ముడితో గొడవపడతావా?': శ్రీజేష్ పిల్లలతో మోదీ సరదా కబుర్లు...

భారత హకీ జట్టు మాజీ సభ్యులు పీఆర్ శ్రీజేశ్ కుటుంబసభ్యులు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. శ్రీజేష్ పిల్లలతో మోదీ సరదాగా మాట్లాడారు. పారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. ఈ జట్టులో గోల్ కీపర్ గా పీఆర్ శ్రీజేష్ ఉన్నారు. ఈ ఒలింపిక్స్ తో తన కెరీర్ కు ఆయన వీడ్కోలు పలికారు. పారిస్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన భారత అథ్లెట్లతో ప్రధాని భేటీ అయ్యారు. శ్రేజేష్ కుటుంబసభ్యులతో మోదీ సరదాగా గడిపారు.

క్రీడాకారులను పరిచయం చేసుకుంటూ వస్తూనే శ్రీజేష్ కొడుకు శ్రీయాన్ష్ ను మోదీ దగ్గరకు తీసుకున్నారు. కుటుంబ సభ్యుల గురించి అడిగారు. మీ నాన్న నిన్ను కొడతారా అని మోదీ ప్రశ్నకు ఆ చిన్నారి అవును అని చెప్పడంతో అంతా నవ్వారు. శ్రేజేష్ కూతురితో మోదీ మాట్లాడారు. తమ్ముడితో గొడవపడుతావా... ఇందులో ఎవరు గెలుస్తారని మోదీ ప్రశ్నకు తానే అని ఆమె సమాధానమిచ్చారు.

నీవు ఇక్కడే ఉండు .. మీ కుటుంబ సభ్యులకు బై చెప్పు అంటూ శ్రీయాన్ష్ తో ప్రధాని అన్నారు. ఆ తర్వాత వారిని తీసుకొని డైనింగ్ హాల్ వరకు వెళ్లారు. ఆ చిన్నారికి మిఠాయి తినిపించారు మోదీ.

Show Full Article
Print Article
Next Story
More Stories