రేపు బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు

Maoists Call For Bandh Tomorrow
x

రేపు బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు 

Highlights

Maoists: బీజాపూర్-మావోయిస్టుల పేరుతో కర పత్రం విడుదల

Maoists: ఛత్తీస్‌గడ్‌‌లో మావోయిస్టుల కరపత్రం.. అలజడిరేపింది. ఛత్తీస్‌గఢ్‌లో రేపు బంద్‌కు పిలుపునిస్తూ.. కరపత్రం.. బ్యానర్లు విడుదల చేశారు. ఆవపల్లి-ఉసూరు.. బీజాపూర్-ఉసూరు రహదారిని నక్సలైట్లు దిగ్బంధించారు. రోడ్డుకు ఇరువైపులా బ్యానర్లు ఏర్పాటు చేశారు. విష్ణుదేవ్ ప్రభుత్వం గిరిజన వ్యతిరేకి అని ఆ కరపత్రాల్లో.. బ్యానర్లలో మావోయిస్టులు పేర్కొన్నారు.

మే 10న పిడియాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఛత్తీస్‌గఢ్ పోలీసులు 12 మంది నక్సలైట్లను హతమార్చినట్లు ప్రకటించారు. అయితే.. ఎన్‌కౌంటర్‌లో మరణించిన 10 మందిని గ్రామస్థులుగా పేర్కొంటూ నక్సలైట్లు బంద్‌కు పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories