Maldives President: ఢిల్లీకి వచ్చి 'డిప్లొమాటిక్ యూ టర్న్' తీసుకున్న మాల్దీవులు అధ్యక్షుడు మొహమెద్ ముయిజ్జు

Maldives President: ఢిల్లీకి వచ్చి డిప్లొమాటిక్ యూ టర్న్ తీసుకున్న మాల్దీవులు అధ్యక్షుడు మొహమెద్ ముయిజ్జు
x
Highlights

Maldives President: మాల్దీవుల అధ్యక్షుడు మొహమెద్ ముయిజ్జు ఇండియా పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం ఇండియాకు వచ్చిన...

Maldives President: మాల్దీవుల అధ్యక్షుడు మొహమెద్ ముయిజ్జు ఇండియా పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం ఇండియాకు వచ్చిన ముయిజ్జుకి భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన స్వాగతం పలికారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో సోమవారం మొహమెద్ ముయిజ్జు భారత దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, మొహమెద్ ముయిజ్జుల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం జరిగిన జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మొహమెద్ ముయిజ్జు కీలక వ్యాఖ్యలు చేశారు.

తనని భారత్‌కి ఆహ్వానించినందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ముయిజ్జు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తనకి ఘన స్వాగతం పలికిన ప్రధాని మోదీ, దేశ ప్రజలకు కూడా కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. మాల్దీవులలో పర్యటించే వారిలో భారతీయులే అధికం కావడంతో వీరి సమావేశంలో టూరిజం అంశం కూడా ప్రధానంగా చర్చకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ముయిజ్జు మాట్లాడుతూ.. ఇప్పటికే ఎంతో మంది భారతీయులు మాల్దీవులను సందర్శిస్తుంటారని.. భవిష్యత్తులో మరింత మంది తమ దేశాన్ని సందర్శిస్తారని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆర్థికంగా అభివృద్ధి చెందడంలో రెండు దేశాలు కలిసి ప్రయాణించాల్సిన అంశాలు, అలాగే భద్రతాపరమైన అంశాలు చర్చకొచ్చినట్లు చెప్పారు.

"మాల్దీవులకు అవసరం వచ్చిన ప్రతీసారి భారత్ తమ దేశానికి వెన్నంటి ఉంది. స్నేహ హస్తం అందిస్తోంది. అలాగే తమ దేశ ఆర్థికాభివృద్ధిలో భారత్ ఎంతో కీలక పాత్ర" అని మాల్దీవులు అధ్యక్షుడు మొహమెద్ ముయిజ్జు అభిప్రాయపడ్డారు. ఏళ్ల తరబడిగా మాల్దీవులకు అండగా నిలుస్తోన్న ప్రధాని మోదీతో పాటు భారతీయులకు తాను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ప్రధాని మోదీ మాట్లాడుతూ, భారత్, మాల్జీవుల బంధం వందల ఏళ్లనాటిదన్నారు. ఇండియా మాల్దీవులకు దగ్గరిగా ఉన్న పొరుగు దేశం మాత్రమే కాదు.. క్లోజ్ ఫ్రెండ్ కూడా అని అన్నారు. పొరుగు దేశాలతో భారత్ సత్సంబంధాల విషయంలో మాల్దీవులది ఎప్పుడూ ప్రత్యేక స్థానమే అని మోదీ అభిప్రాయపడ్డారు.

మొహమెద్ ముయిజ్జు తీరు మార్చుకున్నారా?

ఇప్పుడు మాల్దీవుల అధ్యక్షుడు మొహమెద్ ముయిజ్జు భారత్ పర్యటనలో చేసిన సానుకూల వ్యాఖ్యలతో ఒక రకంగా భారత్, మాల్దీవుల మధ్య గత 10 నెలలుగా నెలకొన్న అనిశ్చితికి తెరపడినట్లయింది. గతంలో భారత ప్రధానిని, భారత్‌ని తక్కువ చేస్తూ మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపాయి. దాంతో రెండు దేశాల మధ్య దూరం పెరిగింది.

అదే సమయంలోనే ప్రధాని మోదీ లక్షద్వీప్‌లో పర్యటించి ఆ ప్రాంతంలోని అందాల గురించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇండియన్ టూరిస్టులను మాల్దీవ్స్ వెళ్లకుండా లక్షద్వీప్ వైపు మళ్లించే యోచనలోనే ప్రధాని మోదీ అక్కడ పర్యటించారు అనే అభిప్రాయం వ్యక్తమైంది. అంతేకాదు.. భారత్ వైపు నుండి "బాయ్‌కాట్ మాల్దీవ్స్" అనే స్లోగన్ కూడా వైరల్ అయింది. అప్పటి నుండి రెండు దేశాల మధ్య అనిశ్చిత పరిస్థితులు ఏర్పడినప్పటికీ... తాజాగా భారత పర్యటనలో మొహమెద్ ముయిజ్జు మాట్లాడిన తీరు ఆ పరిస్థితిని మార్చేలా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories