Modi: పాత పార్లమెంట్ భవనంలో చివరి సెషన్.. ఈ భవనం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది

Last Session In The Old Parliament Building
x

Modi: పాత పార్లమెంట్ భవనంలో చివరి సెషన్.. ఈ భవనం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది

Highlights

Modi: జీ20, చంద్రయాన్ విజయంపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

Modi: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. పాత పార్లమెంట్‌ భవనంలో జరిగే చివరి సెషన్‌ చారిత్రాత్మకమైనదని మోదీ అన్నారు. కొత్త పార్లమెంట్ భవనానికి మారడానికి ముందు, ఇక్కడ ఓ చారిత్రాత్మక సమావేశాన్ని నిర్వహిస్తున్నామని మోడీ తెలిపారు. ఈ భవనాన్ని నిర్మించాలని బ్రిటిష్ వారు నిర్ణయం తీసుకున్నారని, దీనిని నిర్మించడానికి తన దేశస్థులు తమ రక్తం,చెమటను వెచ్చించారన్నారు.

గతంలో 75 ఏళ్లుగా ఈ భవనంలో ఉన్న ప్రతి ఒక్కరూ భారతీయ సంస్కృతిని కాపాడారని ప్రధాని మోడీ తెలిపారు. మనం కొత్త పార్లమెంటు భవనానికి వెళ్లినా, ఈ భవనం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. అనంతరం చారిత్రక జీ20 సదస్సు విజయంతో పాటు చంద్రయాన్ 3 విజయంపైనా మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దేశం నుంచి తనకు లభిస్తున్న ప్రేమ, గౌరవం చూసి పొంగిపోయానన్నారు. తనకు దేశం నుండి ఇంత ప్రేమ, గౌరవం లభిస్తాయని ఎప్పుడూ ఊహించలేదన్నారు. రైల్వేస్టేషన్‌పై నిద్రిస్తున్న ఓ చిన్నారి పార్లమెంట్‌లో ఏదో ఒకరోజు మాట్లాడతానని ఊహించలేదన్నారు. దీనికి దేశానికి కృతజ్ఞతలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories