KC Venugopal: ఎన్డీయే హయాంలో చేపట్టిన నిర్మాణాలు కుప్పకూలుతున్నాయ్‌

KC Venugopal Says Under Nda Rule Every Building Is Under The Threat
x

KC Venugopal: ఎన్డీయే హయాంలో చేపట్టిన నిర్మాణాలు కుప్పకూలుతున్నాయ్‌

Highlights

KC Venugopal: ఎన్డీయే హయాంలో చేపట్టిన ప్రతిష్టాత్మక నిర్మాణాలన్నీ కూలిపోయే ప్రమాదంలో ఉన్నాయని కాంగ్రెస్‌ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

KC Venugopal: ఎన్డీయే హయాంలో చేపట్టిన ప్రతిష్టాత్మక నిర్మాణాలన్నీ కూలిపోయే ప్రమాదంలో ఉన్నాయని కాంగ్రెస్‌ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ విమానాశ్రయం పైకప్పు కూలిందని, జబల్‌పూర్‌ ఎయిర్‌పోర్ట్ రూఫ్‌ కూలిందని, రాజ్‌కోట్‌ ఎయిర్‌పోర్ట్‌ కనోపీ ధ్వంసమైందని లోక్‌సభలో వివరించారు. అయోధ్యలో రహదారుల పరిస్ధితి దారుణంగా ఉందని, రామ్‌ మందిర్‌లో లీకేజీలు, ముంబై హార్బర్‌ లింక్‌ రోడ్డులో పగుళ్లు చోటుచేసుకున్నాయని చెప్పారు.

బిహార్‌లో మూడు వంతెనలు కుప్పకూలగా, ప్రగతి మైదాన్‌ టన్నెల్‌ నీటి మునిగిందని తెలిపారు. ఈ నిర్మాణాలన్నీ ఎన్డీయే హయాంలో చేపట్టినవేనని వెల్లడించారు. దేశంలో అతిపెద్ద కుంభకోణం ఎన్నికల బాండ్ల స్కామ్‌ అని, ఎన్నికల బాండ్ల వ్యవహారంపై విచారణ జరిపించాలని లోక్ సభలో కేసీ వేణుగోపాల్ ప్రధాని నరేంద్ర మోదీకి సవాల్ విసిరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories