Jai Shankar: భారత్‌కు ఉన్న అతిపెద్ద సమస్య చైనా

Indias biggest problem is China Says Jai Shankar
x

Jai Shankar: భారత్‌కు ఉన్న అతిపెద్ద సమస్య చైనా

Highlights

Jai Shankar: చైనాతోనే ప్రపంచ దేశాలకు సమస్య ఉంది

Jai Shankar: చైనాపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలు చైనా నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నాయన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే చైనాతో భారత్‌కు ఉన్న సమస్య ఇంకాస్త ఎక్కువేనని తెలిపారు. ఎకనామిక్‌ టైమ్స్‌ నిర్వహించిన కార్యక్రమంలో వెల్లడించారు. దశాబ్దాల క్రితం ప్రపంచదేశాలు చైనా సమస్యను పెద్దగా పట్టించుకోలేదని.. అది పెరిగి పెద్దదై ఇప్పుడు అదే అతిపెద్ద సమస్యగా మారిందన్నారు.

ప్రపంచ దేశాలతో పోల్చినప్పుడు చైనాతో మనకున్న సమస్యను మరింత తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. కేవలం చైనా నుంచి వచ్చే పెట్టుబడులు మాత్రమే కాదు, ఏ పెట్టుబడుల విషయలోనైనా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందని జైశంకర్‌ అన్నాురు.

Show Full Article
Print Article
Next Story
More Stories