Narendra Modi: ప్రధాని మోడీతో భారత చెస్ ప్లేయర్ల భేటీ

Indian chess players meeting with Prime Minister Modi
x

Narendra Modi: ప్రధాని మోడీతో భారత చెస్ ప్లేయర్ల భేటీ

Highlights

Narendra Modi: గోల్డ్ మెడల్స్‌ సాధించిన చెస్ ప్లేయర్లకు మోడీ అభినందనలు

Narendra Modi: బుడాపెస్ట్‌లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో గోల్డ్ మెడల్స్ సాధించి, భారత్‌కు చారిత్రక విజయాన్ని అందించిన ప్లేయర్స్‌ను ప్రధాని మోడీ అభినందించారు. మెన్స్, విమెన్స్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్ సాధించిన భారత చెస్ బృందం మోడీని కలిసింది. మోడీతో భేటీ అయిన వారిలో వైశాలి, హారిక, తానియా, సచ్‌దేవ్, విదిత్ గుజరాతీ, ప్రజ్ఞానంద, అర్జున్ సహా పసిడి పతకాలు గెలుచుకున్న చెస్ ప్లేయర్లు ఉన్నారు. చెస్ క్రీడలో తమ అనుభవాలను మోడీకి వివరించారు.

ఈ సందర్భంగా చెస్ ప్లేయర్లు అందిరితో విడివిడిగా ముచ్చటించారు. పేరుపేరునా అభినందించారు. క్రీడాకారులు చెస్ బోర్డును మోడీకి బహుమతిగా ఇచ్చారు. ఇటీవల అజర్‌బైజాన్‌లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో మెన్స్ టీమ్ స్లోవేనియాపై... విమెన్స్‌ జట్టు అజర్‌బైజాన్‌పై ఘన విజయం సాధించి.. హిస్టరీ క్రియేట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories