India Bloc: కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించడంతో ఇండియా బ్లాక్ ఆందోళన

INDIA Bloc Protest at Jantar Mantar Over Declining Arvind Kejriwal Health
x

 India Bloc: కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించడంతో ఇండియా బ్లాక్ ఆందోళన

Highlights

India Bloc: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇండియా కూటమి ర్యాలీ

India Bloc: జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించడంపై ఇండియా బ్లాక్ ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇండి కూటమి ర్యాలీ నిర్వహించింది. ప్రధాన భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, జార్ఖండ్ ముక్తి మోర్చా, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన(యూ), ఎన్సీపీ-ఎస్పీ, ఇంకా ఇతర ప్రతిపక్ష పార్టీలు పాల్గొన్నాయి. జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను హత్య చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని విపక్ష సభ్యులు ఆరోపించారు. జూన్ 3 నుంచి జూలై 7 మధ్య కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ 34 సార్లు పడిపోయినట్టు మెడికల్ రిపోర్టులు చెబుతున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలు చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories