శంభు సరిహద్దులో రైతుల భారీ నిరసన.. పాల్గొన్న వినేష్ ఫోగట్

Vinesh Phogat
x

Vinesh Phogat

Highlights

ఈ అంశంపై మాట్లాడను అని తేల్చిన వినేష్ ఫొగాట్

కొన్నాళ్లుగా తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరతానని జరుగుతున్న ప్రచారంపై ఒలింపియన్‌ వినేశ్‌ ఫొగాట్‌ స్పందించారు. హరియాణాలోని శంభూ సరిహద్దు వద్ద రైతులు కొన్నాళ్లుగా చేపట్టిన ఆందోళనలో ఈరోజు వినేశ్‌ ఫొగాట్‌ పాల్గొన్నారు. రైతులకు తన మద్దతు ఉంటుందని తెలిపారు. ఓ విలేకరి ఆమెను ఉద్దేశించి ‘‘మీరు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారా..?’’ అని ప్రశ్నించగా.. ఈ అంశంపై మాట్లాడదల్చుకోలేదని స్పష్టం చేశారు. మీరు దృష్టిని నా వైపు తిప్పితే.. రైతుల పోరాటం, కష్టాలు వృథా అవుతాయన్నారు. ఇక్కడ ఫోకస్ నాపై కాదు.. రైతులపై మాత్రమే ఉండాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories