ఓటింగ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించాం.. లేచి నిల్చుని ఓటర్లకు చప్పట్లు కొట్టిన ఈసీ సభ్యులు

Election Commission Gives Standing Ovation To Voters
x

ప్రెస్‌మీట్‌లో లేచి నిల్చుని ఓటర్లకు చప్పట్లు కొట్టిన ఈసీ సభ్యులు

Highlights

దేశంలో చరిత్రాత్మక ఎన్నికలు జరిగాయని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్‌ అన్నారు.

EC Press Meet: కేంద్ర ఎన్నికల సంఘం చరిత్రలోనే అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ప్రెస్‌మీట్‌లో లేచి నిల్చుని సీనియర్ సిటిజన్లు, మహిళా ఓటర్లకు ఈసీ సభ్యులు చప్పట్లు కొట్టారు. రేపు ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో ఇవాళ సీఈసీ రాజీవ్‌కుమార్‌ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.

ఈ సందర్భంగా ఫస్ట్ టైం ఓటర్లకు ఈసీ సభ్యులు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. దేశంలో చరిత్రాత్మక ఎన్నికలు జరిగాయని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్‌ అన్నారు. ఓటింగ్‌లో భారత్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించిందని తెలిపారు. ఓటేసిన ప్రతి ఒక్కరికీ మేం ధన్యవాదాలు చెబుతున్నామని అన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో 64.2కోట్ల మంది ఓటేయడం ప్రపంచ రికార్డడని సీఈసీ రాజీవ్‌కుమార్ మీనా తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories