Shashi Tharoor: బీజేపీ పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్

Congress MP Shashi Tharoor lashed out BJP
x

Shashi Tharoor: బీజేపీ పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్

Highlights

Shashi Tharoor: ఇప్పటికి అబ్ కీ బార్ చార్ సౌ పార్ సాధ్యమైందన్న శశిథరూర్

Shashi Tharoor: BJPని ఉద్దేశిస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్ చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో BJPకి 370 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని, NDA 400లకు పైగా సీట్లు సాధిస్తుందని ప్రధాని మోడీ తన ప్రచారాల్లో తరచుగా చెప్పారు. కానీ ఫలితాల్లో 293 సీట్లతో NDA ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే బ్రిటన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ 400లకు పైగా సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఈ రెండు దేశాల్లోని ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి శశి థరూర్‌ సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌ వైరలైంది. ఇందులో ఆయన ఎట్టకేలకు అబ్‌ కీ బార్‌ చార్ సౌ పార్‌ సాధ్యమైంది అంటూ BJPపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories