భారీ రైలు ప్రమాదానికి కుట్ర.. ట్రాక్‌పై సిమెంట్ దిమ్మెను పెట్టిన దుండగులు

Cement Blocks Found on Railway Tracks in Rajasthan Ajmer
x

భారీ రైలు ప్రమాదానికి కుట్ర.. ట్రాక్‌పై సిమెంట్ దిమ్మెను పెట్టిన దుండగులు

Highlights

Rajasthan: రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో భారీ రైలు ప్రమాదానికి కుట్ర జరిగింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే ట్రాక్‌పై సిమెంట్ దిమ్మెను అమర్చారు.

Rajasthan: రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో భారీ రైలు ప్రమాదానికి కుట్ర జరిగింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే ట్రాక్‌పై సిమెంట్ దిమ్మెను అమర్చారు. వేగంగా వచ్చిన ఓ రైలు ఆ సిమెంట్ దిమ్మెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైలు ఇంజిన్‌తో పాటు కొంత భాగం ట్రాక్ కూడా దెబ్బతింది. దీంతో వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ ఆర్పీఎఫ్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు, అధికారులకు కావాలనే ఎవరో కుట్ర చేశారని అనుమానిస్తున్నారు.

ఈ కుట్రలో ఒకరి కంటే ఎక్కుమంది ప్రమేయం ఉందని అంచనా వేస్తున్నారు. గత రెండ్రోజుల క్రితం కాన్పూర్‌లో ఇదే తరహా కుట్ర జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories