Rahul Gandhi: పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి బెయిల్

Bengaluru Court Grants Bail to Rahul Gandhi in Defamation Case
x

Rahul Gandhi: పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి బెయిల్

Highlights

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ బెంగళూరులోని సిటీ సివిల్ కోర్టులో విచారణకు హాజరయ్యారు.

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ బెంగళూరులోని సిటీ సివిల్ కోర్టులో విచారణకు హాజరయ్యారు. గతేదాడి జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తమపై ఆరోపణలు చేశారంటూ బీజేపీ ఫిర్యాదు చేసింది. రాహుల్‌తో పాటు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లపై కర్నాటక రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కంప్లయింట్ చేశారు. అయితే విచారణకు గైర్హాజరు అవుతున్నారంటూ వారిపై కోర్టు వారెంట్లు జారీ చేసింది.

కాగా ఇటీవలే సిద్ధరామయ్య, శివకుమార్‌లు కోర్టుకు హాజరయ్యారు. రాహుల్‌గాంధీ హాజరుకాకపోవడంతో ఇవాళ స్వయంగా రావాలంటూ న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఆ‍యన కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది న్యాయస్థానం.

Show Full Article
Print Article
Next Story
More Stories