Amit Shah: ఆయుధాలు వీడకపోతే.. ఆలౌట్‌ ఆపరేషన్‌ మొదలుపెడతాం

Amit Shah Appeals To Maoists To Lay Down Arms Warns Of Action If They Dont
x

Amit Shah: ఆయుధాలు వీడకపోతే.. ఆలౌట్‌ ఆపరేషన్‌ మొదలుపెడతాం

Highlights

Amit Shah: 2026 నాటికి నక్సలిజం తుడిచిపెట్టుకుపోతుంది

Amit Shah: మావోయిస్టులు హింసను, ఆయుధాలను వదిలేసి లొంగిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. లేకుంటే ఆపరేషన్ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈనేపథ్యంలో 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం తుడిచిపెట్టుకుపోతుందని కేంద్ర హోమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. హింసను వీడి లొంగిపోవాలని మావోయిస్టులకు సూచించారు. ఛత్తీస్ గఢ్ లో నక్సల్స్ హింసాకాండలో 55 మంది బాధితులను ఉద్దేశించి ఆయన శుక్రవారం ఈమేరకు వ్యాఖ్యానించారు.

దేశంలో మావోయిస్టుల హింస, భావజాలాన్ని నిర్మూలించి శాంతిని నెలకొల్పాలని ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయించుకున్నారని అమిత్ షా పేర్కొన్నారు. మావోయిస్టులు ఒకప్పుడు నేపాల్ నుంచి పశుపతినాథ్ నుంచి తిరుపతి వరకు కారిడార్ ఏర్పాటుచేయాలని భావించారని కానీ, మోడీనేతృత్వంలో దాన్ని ధ్వంసం చేశామన్నారు. ఈసందర్భంగా హింసను, ఆయుధాలను వదిలేసి లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories