విహారయాత్రలో పెను విషాదం.. ఒకే కుటుంబంలో అయిదుగురు గల్లంతు..

Family of 5 Including 2 Minors Die by Drowning in Bhushi Dam
x

విహారయాత్రలో పెను విషాదం.. ఒకే కుటుంబంలో అయిదుగురు గల్లంతు..

Highlights

Lonavala Bhushi Dam: సెలవు రోజు సరదాగా గడిపేందుకు విహారయాత్రకు వచ్చిన ఓ కుటుంబానికి తీరని విషాదం మిగిలింది.

Lonavala Bhushi Dam: సెలవు రోజు సరదాగా గడిపేందుకు విహారయాత్రకు వచ్చిన ఓ కుటుంబానికి తీరని విషాదం మిగిలింది. భూసీ డ్యామ్ సమీపంలోని జలపాతం వద్ద మహిళ, నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. ఇందులో ముగ్గురి మృతదేహాలు లభ్యం కాగా మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలోని లోనావాలా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వర్షాలు పడితే లోనావాలా సీజన్ స్టార్ట్ అవుతుంది. ఆదివారం ఓ కుటుంబం లోనావాలాలో డ్యామ్‌ సమీపంలోని జలపాతం సందర్శనకు వచ్చింది. అలా వచ్చిన ఫ్యామిలీకి ఆదివారం విషాదాన్ని నింపింది. డ్యామ్ దగ్గర సరదాగా గడుపుతుండగా కాలుజారి నీటిలో పడిపోయారు. ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నంలో.. జలపాతం వరద ప్రవాహానికి కుటుంబం కొట్టుకుపోయింది.

వారిలో ముగ్గురు మృతదేహాలు లభ్యం కాగా.. మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో ఇద్దరు ఆరేళ్ల చిన్నారులు సైతం ఉన్నారు. కుటుంబంలో ఎవ్వరికి ఈత రాకపోవడంతో పాటు వర్షాల కారణంగా నేల చాలా బురదగా ఉండడం కూడా ఈ ప్రమాదానికి కారణమయి ఉంటుందని తెలిపారు. స్థానికుల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు అధికారులు. తాళ్ల సాయంతో ట్రెకింగ్ చేస్తూ రెస్క్యూ ఆపరేషన్‌ చేపడుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories