Tollywood Producers: వరద బాధితులకు సినీ ప్రముఖుల విరాళాలు: ఎవరెంత ఇచ్చారంటే?

The Telugu film industry has come forward to help flood victims
x

Tollywood Producers: వరద బాధితులకు సినీ ప్రముఖుల విరాళాలు: ఎవరెంత ఇచ్చారంటే?

Highlights

ఫిలిం ఛాంబర్ ఆంధ్రకు రూ. 25, తెలంగాణకు రూ. 25 లక్షల విరాళం

వరదలతో అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు సినీ ఇండస్ట్రీ పెద్దల నుంచి.. విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. వరద బాధిత ప్రాంతాలకు తమ వంతు సహాయం అందించడానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ముందుకొచ్చింది. ఆంధ్రకు 25 లక్షలు, తెలంగాణకు 25 లక్షలు ప్రకటించింది ఫిలిం ఛాంబర్. లాగే ఏపీకి 10 లక్షలు, తెలంగాణకు 10 లక్షలు విరాళం ఇస్తామని నిర్మాతల మండలి సభ్యులు పేర్కొన్నారు.

హీరోలు వెంకటేష్, రాణా తరఫున ఇరు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయలు విరాళంగా ఇస్తామని నిర్మాత సురేష్ బాబు తెలిపారు. తెలంగాణకు 25 లక్షలు, ఆంధ్రకు 25 లక్షల విరాళం అందజేస్తామని దిల్ రాజు చెప్పారు. ఆంధ్రకు 5 లక్షలు, తెలంగాణకు 5 లక్షలు విరాళం ఇస్తామని సినీ కార్మికుల ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ తెలిపారు. ఫిలిం ఛాంబర్ తరఫున విరాళాల సేకరణ జరుగుతుందని సినీ పెద్దలు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories