Tirupati Laddu: తిరుమల లడ్డూ వ్యవహారంపై రజినీకాంత్‌కు ఎదురైన ప్రశ్న.. ఏమన్నారంటే.. ?

Tirupati Laddu: తిరుమల లడ్డూ వ్యవహారంపై రజినీకాంత్‌కు ఎదురైన ప్రశ్న.. ఏమన్నారంటే.. ?
x
Highlights

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాదం ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాదం ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ అంశం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అన్ని జాతీయ ఛానెల్స్‌లో ఇందుకు సంబంధించి ప్రస్తావన వచ్చింది.

ఇక తిరుమల లడ్డూ వ్యవహారం వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ అంశంపై రాజకీయ నాయకులు మొదలు, సినీ సెలబ్రిటీలు సైతం స్పందిస్తున్నారు. ప్రతీ ఒక్కరికీ ఇదే ప్రశ్న ఎదురవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సూపర్‌ స్టార్‌, తమిళ హీరో రజినీకాంత్‌కు కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. రజినీ ప్రస్తుతం వేట్టయాన్‌ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.

ఇందులో భాగంగానే తాజాగా పలువురు విలేకర్లు రజినీతో ముచ్చటించారు. సినిమా విశేషాలు అడిగే సమయంలో ఒక విలేకరి.. ‘‘తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందంటూ వార్తలు వస్తున్నాయి. దానిపై మీ అభిప్రాయం ఏమిటి?’’ అని ప్రశ్నించారు. అయితే రజినీకాంత్‌ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మాత్రం పెద్దగా ఆసక్తి చూపించలేదు. ‘‘సారీ.. నో కామెంట్స్‌’’ అని అక్కడినుంచి వెళ్లిపోయారు. దీంతో రజినీ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటే ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన తన సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న పాల్గొన్న కార్తి.. ‘ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడకూడదు. సున్నితమైన అంశం’ అని సరదాగా విలేకరి ప్రశ్నకు బదులిచ్చారు. ఈ కామెంట్స్‌ పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ స్పందించడం. దానికి బదులుగా కార్తీ క్షమాపణలు చెప్పడం నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories