Rajinikanth: రజనీ ఆరోగ్యంపై ఆరా తీసిన ప్రధాని మోదీ.. ఫోన్‌కాల్‌..

Rajinikanth Health Update
x

Rajinikanth: రజనీ ఆరోగ్యంపై ఆరా తీసిన ప్రధాని మోదీ.. ఫోన్‌కాల్‌.. 

Highlights

Rajinikanth Health Update: ప్రముఖ నటుడు తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.

Rajinikanth Health Update: ప్రముఖ నటుడు తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. తీవ్ర కడుపునొప్పితో రజనీకాంత్‌ సోమవారం రాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఆయన చేరారు. ఆయన గుండె నాళంలో సమస్య ఉన్నట్లు గుర్తించి స్టెంట్ వేశారు వైద్యలు.

ప్రస్తుతం రజనీకాంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు ప్రకటించారు. మరో రెండు రోజుల్లో ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేస్తారు. ఇదిలా ఉంటే రజనీ ఆసుపత్రిలో చేరారన్న వార్తలు రావడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన క్షేమంగా ఉన్నారని తెలియడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ఆయన మంచిని కోరుకుంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. రజనీకాంత్‌ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. అక్టోబర్‌ 1న రజనీ భార్య లతతో ప్రధాని ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈవిషయాన్ని తమిళనాడు భాజపా రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌ వేదికగా తెలిపారు. ‘మన సూపర్‌స్టార్‌ ఆరోగ్యం గురించి ప్రధాని మోదీ ఆరా తీశారు. రజనీకాంత్‌ భార్యతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు’ అని రాశారు.

ఇక రజనీ త్వరగా కోలుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, హీరో కమల్‌హాసన్‌లు సైతం ఎక్స్‌ వేదికగా పోస్ట్ చేశారు. హీరో విజయ్‌ కూడా రజనీకాంత్‌ త్వరగా ఇంటికి తిరిగి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పోస్ట్ పెట్టారు. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడిందని గుర్తించిన వైద్యులు ట్రాన్స్‌కాథెటర్‌ పద్ధతి ద్వారా చికిత్స అందించి స్టెంట్ అమర్చినట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories