Adipurush: ఆదిపురుష్‌ ఫలితంపై స్పందించిన ఓంరౌత్‌.. ఏమన్నారంటే.. ?

Director om raut interesting comments about adipurush movie result
x

Adipurush: ఆదిపురుష్‌ ఫలితంపై స్పందించిన ఓంరౌత్‌.. ఏమన్నారంటే.. ?

Highlights

దర్శకుడు ఓంరౌత్ ప్రభాస్‌ను బాగా చూపించలేదంటూ ఫ్యాన్స్‌ ఓరేంజ్‌లో ఫైర్‌ అయ్యారు.

ప్రభాస్‌ హీరోగా, బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఆదిపురుష్‌. దాదాపు రూ. 600 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. రామాయణం ఇతివృత్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలైన సమయంలో పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి.

దర్శకుడు ఓంరౌత్ ప్రభాస్‌ను బాగా చూపించలేదంటూ ఫ్యాన్స్‌ ఓరేంజ్‌లో ఫైర్‌ అయ్యారు. అయితే ఆదిపురుష్‌ విడుదలైన ఇన్నేళ్ల తర్వాత కూడా ఏదో ఒక సమయంలో ఆదిపురుష్‌పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు ఓంరౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదిపురుష్‌.. ప్రేక్షకుల అంచనాలను అందుకోకోపయినప్పటికీ బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌ సొంతం చేసుకుందని చెప్పుకొచ్చారు.

ఇక సోషల్‌ మీడియాలో జరిగిన ట్రోలింగ్‌పై స్పందించిన ఓంరౌత్‌.. ముక్కు, ముఖం తెలియని వాళ్లు చేసే ట్రోల్స్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నార. ఒక సినిమా విషయంలో బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌ను మాత్రమే కీలకంగా పరిగణలోకి తీసుకుంటారని, ఆదిపురుష్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిందన్నారు. తొలిరోజే దేశవ్యాప్తంగా రూ.70 కోట్లు వసూలు చేసిందన్న దర్శకుడు, మొత్తంగా రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టిందన్నారు. ఇక ఆంధ్రా-తెలంగాణలో మాత్రమే రూ.200 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసిందని ఓంరౌత్ చెప్పుకొచ్చారు. ఓంరౌత్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట ట్రెండ్‌ అవుతున్నాయి.

అయితే ఈ వ్యాఖ్యలపై కూడా నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఓంరౌత్‌ను మళ్లీ ట్రోల్స్‌ చేస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రభాస్‌తో కల్కి, సలార్‌ వంటి చిత్రాలు వచ్చాయని.. ఓంరౌత్‌ ప్రభాస్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేదంటూ కొందరు నెటిజన్లు స్పందిస్తున్నారు. ఏది ఏమైనా చాలా ఏళ్ల తర్వాత ఆదిపురుష్‌ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories