Bigg Boss Telugu 8: హౌజ్లో రచ్చ రచ్చ.. ఎగ్స్ టాస్క్తో అంతా గందరగోళం
Bigg Boss Telugu 8: బిగ్బాస్ 8వ సీజన్ రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతోంది. ఒకరకంగా చెప్పాలంటే బిగ్బాస్ ఇస్తున్న టాస్క్లతో హౌజ్మేట్స్ మధ్య రచ్చ జరుగుతోంది.
Bigg Boss Telugu 8: బిగ్బాస్ 8వ సీజన్ రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతోంది. ఒకరకంగా చెప్పాలంటే బిగ్బాస్ ఇస్తున్న టాస్క్లతో హౌజ్మేట్స్ మధ్య రచ్చ జరుగుతోంది. తాజాగా బిగ్బాస్ ఇచ్చిన ఎగ్స్ కలెక్షన్ టాస్క్ తీవ్ర గందగరోళానికి తెర తీసింది. సెప్టెంబర్ 19వ తేదీన జరిగిన ఎపిసోడ్లో ఈ రచ్చకు దారి తీసింది. ఇంతకీ హౌజ్లో లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగింది.? అసలు ఎలా ఆ రోజు ముగిసిందో ఇప్పుడు తెలుసుకుందాం.
కాంతార, శక్తి టీమ్లుగా విడిపోయిన హౌజ్మేట్స్ ఎగ్స్ కోసం చిన్న సైజ్ యుద్ధమే చేశారు. వెనకాముందు చూసుకోకుండా పరిగెత్తి మరీ గుడ్లను సంపాదించుకున్నారు. ఇంతలోనే కాంతార టీమ్ దగ్గరి నుంచి శక్తి టీమ్ గుడ్లు దొంగిలించింది. ఈ విషయాన్ని టీమ్ సభ్యులు తమ చీఫ్ అభయ్కు చెప్పినా అతడు పెద్దగా పట్టించుకోలేదు. కానీ యష్మి, ప్రేరణ మాత్రం ఆ విషయాన్ని సింపుల్గా వదిలేయలేదు. నువ్వానేనా చూసుకుందామన్నరీతిలో పోట్లాడారు. నబీల్ తనను అభ్యంతకరంగా టచ్ చేశాడని గత ఎపిసోడ్లో అన్న విష్ణుప్రియ క్లారిటీ ఇచ్చింది. అతడు తనను టచ్ చేయలేదని, ఎక్కడ టచ్ చేస్తాడోనన్న భయంతో అలా అరిచానంది. నబీల్ మంచి బాలుడు అని సర్టిఫికెట్ ఇస్తూ సారీ చెప్పేసింది. దీంతో ఆ ఇష్యూకి అక్కడితో ఫుల్స్టాప్ పడింది.
ఇదిలా ఉంటే కిచెన్ విషయంలో బిగ్బాస్ పెట్టిన కండిషన్ రచ్చకు దారి తీసిది. ఒక సమయంలో ఒక టీమ్కు సంబంధించిన ముగ్గురు మాత్రమే కిచెన్లో వంట చేసుకోవాల్సి ఉంటుందని బిగ్బాస్ చేసిన ప్రకటనపై అభయ్ విరుచుకుపడ్డాడు. వీళ్లేమైనా మనిషి పుట్టుక పుట్టారా? దిమాక్ లేదు, సైకోగాళ్లు అంటూ బిగ్బాస్పైనే అరిచేశాడు. అయితే ఆ తర్వాత చేసేది ఏం లేక హౌజ్ మేట్స్ అంతా అదే రూల్ను ఫాలో అయిపోయారు.
కాంతార టీమ్ చీఫ్ అభయ్ తన టీమ్కు సపోర్ట్ చేయడం మానేసి ఏం జరిగినా సరే ఎవరూ మాట్లాడొద్దని హెచ్చరించాడు. తనటీమ్ కష్టపడి సాధించిన గుడ్లకు కాపలాగా ఉన్న అభయ్.. తన కళ్లముందే ఎగ్స్ ఎత్తుకుపోతుంటే కూడా పోతే పోనీ అని చూస్తూ ఊరుకుండిపోయాడు. పోయినవాటిని తిరిగి తీసుకొద్దామని యష్మి, ప్రేరణ ప్రయత్నిస్తే కూడా అందుకు అభయ్ ఒప్పుకోలేదు. దీంతో తన జట్టు ఓడిపోడానికి ఒక రకంగా అభయ్ కారణమయ్యాడు. లేడీ కంటెస్టెంట్స్ తామేమి తక్కువ కాదన్నట్లు కిందపడి కొట్టుకున్నారు. ప్రేరణపై విష్ణుప్రియ, సీత దాడి చేశారు. ఇక సోనియా మీద నబీల్ అరవడంతో పృథ్వీ, నిఖిల్ అతడి మీదకు దూసుకెళ్లిపోయారు. చివరగా ఈ రౌండ్లో శక్తి టీమ్ దగ్గర 263, కాంతార టీమ్ దగ్గర 25 గుడ్లు మాత్రమే మిగిలాయి. లీడ్లో ఉన్న శక్తి టీమ్ కాంతార టీమ్లో నుంచి ప్రేరణను గేమ్లో నుంచి ఎలిమినేట్ చేసింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire