Nagarjuna: కొండా సురేఖపై క్రిమినల్‌ చర్యలు తీసుకొండి.. కోర్టుకు నాగార్జున వాంగ్మూలం

Nagarjuna: కొండా సురేఖపై క్రిమినల్‌ చర్యలు తీసుకొండి.. కోర్టుకు నాగార్జున వాంగ్మూలం
x

Nagarjuna: కొండా సురేఖపై క్రిమినల్‌ చర్యలు తీసుకొండి.. కోర్టుకు నాగార్జున వాంగ్మూలం

Highlights

Nagarjuna: నాంపల్లి కోర్టుకు హీరో నాగార్జున హాజరయ్యారు. నాగార్జున వెంట న్యాయవాది, నాగచైతన్య, అమల కూడా ఉన్నారు.

Nagarjuna: నాంపల్లి కోర్టుకు హీరో నాగార్జున హాజరయ్యారు. నాగార్జున వెంట న్యాయవాది, నాగచైతన్య, అమల కూడా ఉన్నారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖపై క్రిమినల్‌ పిటిషన్‌ వేసిన నాగార్జున ఇవాళ వాంగ్మూలం ఇచ్చేందుకు కోర్టుకు వచ్చారు. సాక్షులు సుప్రియ, వెంకరటేశ్వర్లు కూడా కోర్టుకు హాజరయ్యారు.

ఎందుకు పిటిషన్ దాఖలు చేశారని నాగార్జునను న్యాయస్థానం ప్రశ్నించింది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల తమ కుటుంబ పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందని ఆయన కోర్టుకు వాంగ్మూలం ఇచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, అన్ని టెలివిజన్‌ ఛానళ్లు, పత్రికల్లో ఆ వ్యాఖ్యలు వచ్చాయని తెలిపారు. అసత్య ఆరోపణలు చేసిన ఆమెపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోర్టుకు విన్నవించారు. నాగార్జున ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను కోర్టు రికార్డు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories