Ram Charan: మెగా హీరోకు అరుదైన గౌరవం.. ఫుల్‌ ఖుషీ అవుతున్న ఫ్యాన్స్‌

Actor ram charan to gets his wax statue in Madame Tussauds Singapore
x

Ram Charan: మెగా హీరోకు అరుదైన గౌరవం.. ఫుల్‌ ఖుషీ అవుతున్న ఫ్యాన్స్‌ 

Highlights

త్వరలోనే ఈ విగ్రహాన్ని రూపిందించి, ఆవిష్కరిస్తామని ఐఫా వేదికగా టూస్సాడ్స్‌ టీమ్‌ ప్రకటించింది. ఈ అరుదైన గౌరవం దక్కించుకోవడం రామ్‌ చరణ్‌ స్పందించారు.

తండ్రి చిరంజీవి నట వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గురింపును సంపాదించుకున్నారు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌. మగధీరతో మొదలైన చెర్రీ దూకుడు ట్రిపులార్‌ సినిమాతో పీక్స్‌కి చేరింది. ఈ సినిమాతో రామ్‌ చరణ్‌ ఒక్కసారిగా గ్లోబల్ హీరోగా ఎదిగారు. దీంతో ప్రస్తుతం ఈ మెగా హీరో నుంచి సినిమా వస్తుంటంటే ఇప్పుడు అది నేషనల్ వైడ్‌గా బజ్‌కి దారి తీస్తోంది.

ఇదిలా ఉంటే సినిమాలతో నేషనల్ వైడ్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న రామ్‌ చరణ్‌కి ఇప్పుడు మరో అరుదైన గౌరవం లభించబోతోంది. సింగపూర్‌లోని ప్రతిష్టాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియం వారు రామ్‌చరణ్‌ మైనపు బొమ్మను ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే నిర్వాహకులు పనులు సైతం ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఈ మైనపు బొమ్మలో చరణ్‌తో పాటు ఆయన పెంపుడు శునకం రైమీ కూడా ఈ విగ్రహాంలో భాగం కావటం విశేషం. దీనికి సంబంధించిన ఫొటోషూట్‌ ఇప్పటికే పూర్తయింది.

త్వరలోనే ఈ విగ్రహాన్ని రూపిందించి, ఆవిష్కరిస్తామని ఐఫా వేదికగా టూస్సాడ్స్‌ టీమ్‌ ప్రకటించింది. ఈ అరుదైన గౌరవం దక్కించుకోవడం రామ్‌ చరణ్‌ స్పందించారు. టూస్సాడ్స్‌ కుటుంబంలో తానూ భాగం కావడం గౌరవంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. దీంతో రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన హీరోకు ఇంతటి అరుదైన గౌరవం లభించడంపై ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు మన దేశానికి చెందిన పలువురు అగ్ర హీరోలకు సంబంధించిన బొమ్మలను మ్యూజియమ్స్‌లో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కేవలం సింగపూర్‌ మాత్రమే కాకుండా లండన్‌లోని మ్యూజియంలో కూడా ఇలాంటి విగ్రహాలను ఏర్పాటు చేశారు. వీరిలో బాలీవుడ్‌లో అమితాబ్‌ దగ్గర్నుంచి ఖాన్స్‌ త్రయం, హృతిక్‌ రోషన్‌ విగ్రహాలు ఉండగా.. తెలుగు హీరోల్లో ఆ గౌరవాన్ని దక్కించుకున్న హీరోల్లో మహేశ్‌బాబు, ప్రభాస్‌, అల్లు అర్జున్‌ ఉన్నారు. వీరి సరసన రామ్‌చరణ్‌ కూడా చేరబోతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories