IRCTC Tour Plan:శ్రావణమాసంలో సరికొత్త టూర్ ప్యాకేజ్..తక్కువ ఛార్జీకే అరుణాచలం TO తంజావూర్..పూర్తి వివరాలివే
IRCTC Tour Plan: కొన్నిరోజుల్లోనే శ్రావణమాసం ప్రారంభం కానుంది. ఈ మాసంలో చాలా మంది పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వారికోసం ఐఆర్ సీటీసీ అదిరిపోయే ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ ప్యాకేజీ వివరాలేంటి? ఎన్ని రోజులు టూర్. ఇవన్నీ విషయాలు తెలుసుకుందాం.
IRCTC Tour Plan:శ్రావణమాసం హిందువులకు ఎంతో ముఖ్యమైంది. వ్రతాలు, పూజలు అంటూ నిత్యం బిజీగా ఉంటారు. ఈ మాసంలో దేశంలోని ప్రముఖ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. అయితే కొంతమంది భక్తులు దేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాలను దర్శించుకోవాలని ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వారికోసం IRCTC బంపర్ ప్యాకేజీనీ తీసుకువచ్చింది. తక్కువ ఛార్జీతో ప్రముఖ దేవాలయాలన్నీ దర్శించుకోవచ్చు. ఈ ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా శ్రావణం స్పెషల్ IRCTC దివ్య దక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ పేరుతో ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ రైలు ప్రయాణిస్తుందని IRCTC తెలిపింది. సికింద్రాబాద్ నుంచి కాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తుంది. ఈ స్టేషన్లలో రైలు ఎక్కొచ్చు.యాత్ర ముగిసిన తర్వాత ఈ రైల్వేస్టేషన్లలో దిగవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ మొత్తం ఎనిమిది రాత్రిళ్లు, 9 పగళ్లు సాగుతుంది.
-మొదటి రోజు సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12గంటలకు భారత్ గౌరవ్ టూరిస్టు రైలు ప్రారంభం అవుతుంది. కాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా రెండో రోజు ఉదయం 7 గంటలకు తిరువణ్ణామలై రైల్వేస్టేషన్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి ముందుగానే బుక్ చేసిన హోటల్ తీసుకువెళ్తారు. అనంతరం అరుణాచలం దర్శించుకుంటారు. ఆ తర్వాత రైల్వే స్టేషన్ కు వచ్చి కుదాల్ నగర్ కు ప్రయాణం అవుతారు.
-3వ రోజు ఉదయం కుదాల్ నగర్ చేరుకుని ..అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రామేశ్వరం చేరుకుంటారు. అక్కడ స్థానికంగా ఉన్న దేవాలయాలను దర్శించుకుని సాయంత్రం హోటల్ కు వచ్చి అక్కడే భోజనం చేసి నిద్రిస్తారు.
-4వ రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రామేశ్వరం నుంచి బస్సు ప్రయాణం ద్వారా మదురై వెళ్తారు. సాయంత్రం మీనాక్షి అమ్మన్ ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం కుందాల్ నగర్ రైల్వే స్టేషన్ కు చేరకుంటారు. అక్కడి నుంచి కన్యాకుమారికి ప్రయాణం
-5వరోజు ఉదయం కొచ్చువేలి స్టేషన్ కు చేరుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కన్యాకుమారి చేరుకుంటారు. అనంతరం రాక్ మెమోరియల్, గాంధీ మండపం, సూర్యాస్తమయం సందర్శిస్తారు. తిరిగి హోటల్కు చేరుకుని భోజనం ముగించి ఆ రాత్రికి కన్యాకుమారిలో స్టే చేస్తారు.
-6వ రోజు ఉదయం రోడ్డు మార్గం ద్వారా త్రివేండ్రం వెళ్తారు.పద్మనాభ స్వామి ఆలయం దర్శించుకుని.. బీచ్లో ఎంజాయ్ చేస్తారు. అక్కడి నుంచి కొచ్చువేలి స్టేషన్కు చేరుకుంటారు. అనంతరం తిరుచిరాపల్లి బయలుదేరుతారు.
-7వ రోజు ఉదయం తిరుచిరాపల్లి చేరుకుని మధ్యాహ్నం భోజనం తర్వాత తంజావూర్ వెళ్తారు. అక్కడ బృహదీశ్వర ఆలయాన్ని దర్శించుకుని.. అక్కడి నుంచి తంజావూర్ రైల్వే స్టేషన్కు చేరుకుని ...అక్కడి నుంచి సికింద్రాబాద్కు స్టార్ట్ అవుతారు.
-8వ రోజు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట మీదుగా 9వ రోజు ఉదయం 2.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో దివ్య దర్శన యాత్ర పూర్తవుతుంది.
ప్యాకేజీ ధరలు చూస్తే..
ఎకానమీ: పెద్దలకు రూ.14,250, 5 నుంచి 11ఏండ్ల పిల్లలకు రూ.13,250
స్టాండర్డ్: పెద్దలకు రూ.21,900, 5 నుంచి 11 ఏండ్ల పిల్లలకు రూ.20,700.
కంఫర్ట్: పెద్దలకు రూ.28,450, 5 నుంచి 11 ఏండ్ల పిల్లలకు రూ.27,010గా
ప్రస్తుతం ఈ టూర్ ఆగష్టు 4వ తేదీన ప్రారంభం:
- ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం రైల్వే సిబ్బంది చూసుకుంటారు.
- ప్యాకేజ్ను బట్టి ప్రయాణానికి ఏసీ లేదా నాన్ ఏసీ వెహికిల్.
- టూరిస్టులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire