బంగారు గని కూలడంతో 30 మంది మృతి చెందారు. ఈ ఘటన అఫ్గానిస్తాన్ లో చోటుచేసుకుంది. బదక్షన్ ప్రావిన్సులోని కోహిస్తాన్ జిల్లాలో ఉన్న ఓ బంగారు గనిలో...
బంగారు గని కూలడంతో 30 మంది మృతి చెందారు. ఈ ఘటన అఫ్గానిస్తాన్ లో చోటుచేసుకుంది. బదక్షన్ ప్రావిన్సులోని కోహిస్తాన్ జిల్లాలో ఉన్న ఓ బంగారు గనిలో కార్మికులు పనిచేస్తుండగా గోడ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దాంతో శిథిలాల్లో చిక్కుకుని 20 మంది మృతిచెందారు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ మరో 10 మంది మృతిచెందారు.
ఈ ఘటనపై కోహిస్తాన్ గవర్నర్ మొహమ్మద్ రుస్తమ్ రఘీ మాట్లాడుతూ.. ఇక్కడి గ్రామస్తులు నదీతీరంలో బంగారం కోసం 200 అడుగుల లోతైన గనిని తవ్వారు.. ఇంకా లోపలకు దిగి తవ్వకాలు జరుపుతుండగా పైనున్న గోడ ఒక్కసారిగా విరిగిపడింది. దాంతో ఈ దుర్ఘటన జరిగిందని ఆయన అన్నారు. ఈ ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు 50,000 అఫ్గానీలు, క్షతగాత్రుల కుటుంబాలకు 10,000 అఫ్గానీలు నష్టపరిహారంగా అందిస్తామని గవర్నర్ ప్రకటించారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire