ఒకప్పుడు కాంగ్రెస్కి కంచుకోటగా ఉన్న అర్బన్ నియోజకవర్గంలో.. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా ఉన్న, డి. శ్రీనివాస్ను, అర్బన్ ఓటర్లు రెండుసార్లు...
ఒకప్పుడు కాంగ్రెస్కి కంచుకోటగా ఉన్న అర్బన్ నియోజకవర్గంలో.. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా ఉన్న, డి. శ్రీనివాస్ను, అర్బన్ ఓటర్లు రెండుసార్లు ఓడించి బీజేపీకి పట్టం కట్టారు. స్వతంత్రులకు అవకాశం కల్పించి రాష్ట్రం దృష్టిని ఆకర్షించారు.1952 నుంచి నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరగగా, ఆరుసార్లు కాంగ్రెస్, రెండు సార్లు టీడీపీ, బీజేపీ....నాలుగుసార్లు స్వతంత్రులకు ఇక్కడి ఓటర్లు పట్టం కట్టారు. అభ్యర్ధుల గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న మైనార్టీ ఓట్లు, మూడు సార్లు అర్బన్ నియోజకవర్గం నుంచి గెలిచిన రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ మద్దతు ఎవరికి ఉంటే, ఆ అభ్యర్ధుల గెలుపు నల్లేరు మీద నడకలా సాగుతుంది.
నిజామాబాద్ అర్బన్ ఓటర్లు అన్ని పార్టీలను ఆదరించారు. స్వతంత్రులకు పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా బిగాల గణేష్ గుప్తా.. రెండోసారి తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇంటింటి ప్రచారాలు, కుల సంఘాలతో ఆత్మీయ సమావేశాలతో మిగతా పార్టీల కంటే ఓ అడుగు ముందు ఉన్నారు. ఐతే పార్టీలో ఉన్న అంతర్గత కలహాలు, నిజామాబాద్ నగరంలో నత్తతో పోటీ పడుతున్న అభివృద్ది పనులు ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న అర్బన్ లో.. అభ్యర్ధి ఎంపిక అధిష్ఠానానికి కత్తిమీద సాములా మారింది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన మహేష్ కుమార్ గౌడ్, నరాల రత్నాకర్ తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇద్దరిలో ఒకరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ కాంగ్రెస్కు దగ్గరవ్వడం శుభపరిణామంగా ఉన్నా.. ఆయన మద్దతు ఎవరికి ఉంటుందో తెలియకపోవడం గందరగోళంగా మారింది. ఫలితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం ఏ స్ధాయిలో ఉంటుదన్నది ఆసక్తి కలిగిస్తోంది.
రాష్ట్రంలో బీజేపీ గెలిచే స్ధానాల్లో నిజామాబాద్ అర్బన్, ఓ స్ధానంగా ఆ పార్టీ ప్రచారం చేసుకుంటోంది. దీంతో ఈ సీటుపై రాష్ట్రంలో ఎక్కడా లేనంత పోటీ ఉంది. 2009 ఎన్నికలు, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఈ స్ధానం నుంచి గెలుపొందింది. పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్పై బీజేపీ అభ్యర్ధి యెండల లక్ష్మీనారాయణ విజయం సాధించారు. యెండల లక్ష్మీనారాయణతో పాటు, ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, డి.ఎస్. తనయుడు ధర్మపురి అర్వింద్ సైతం ఈ సీటును ఆశిస్తున్నారు. ముగ్గురిలో ఎవరికి టికెట్టు దక్కుతుందో తెలియక పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. అర్బన్లో బీజేపీకి మంచి క్యాడర్, గల్లీ స్థాయిలో పట్టు ఉండటం కలిసొచ్చే అంశం. ఐతే నగరంలో 16 మంది కార్పొరేటర్లు ఉన్న ఎంఐఎం ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోవడం, ఎవరికి కలిసొస్తుందన్నది హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్ధి 31 వేల ఓట్లు సాధించి రెండో స్ధానంలో నిలవడం, అర్బన్లో ఆ పార్టీ బలమెంతో చెప్పకనే చెబుతోంది. ఇక్కడ 2లక్షల 25వేల ఓటర్లు ఉండగా.. మైనార్టీలు, మున్నూరు కాపు, పద్మశాలీల ఓట్లే అధికంగా ఉన్నాయి. ఈ వర్గాలు ఎవరికి మొగ్గు చూపితే ఆ అభ్యర్ధికి గెలిచే అవకాశం ఎక్కువగా ఉది.
నిజామాబాద్ అర్బన్ సీటు హాట్ కేకుగా మారింది. అన్ని పార్టీలకు, బరిలో నిలిచిన అభ్యర్ధులకు చూడటానికి సునాయాస విజయం తమదేనని పైకి కనిపిస్తున్నా.. ఇక్కడి ఓటర్లు, తమ విలక్షణ తీర్పుతో అభ్యర్ధుల తలరాతలు మారుస్తారు. త్రిముఖ పోరులో ఎవరికి పట్టం కడతారన్నది త్వరలో తేలిపోతుంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire