రైతులకు ఏం చేస్తారో చెప్పలేదు: బడ్జెట్ పై కేసీఆర్

తెలంగాణ బడ్జెట్ పై బీఆర్ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. బడ్జెట్ ను చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేదని అర్ధమౌతుందని చెప్పారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం తర్వాత గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం రైతుల కోసం రైతుబంధు కింద రైతులకు సాయం చేస్తే ఆ నిధులు దుర్వినియోగమైనట్టుగా తప్పుడు ప్రచారం చేశారన్నారు.

రైతు బంధు కింద రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు సాకులు చెబుతుందని ఆయన విమర్శలు చేశారు. వ్యవసాయ, ఐటీ, పారిశ్రామిక పాలసీలపై స్పష్టైన విధానం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇచ్చామన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని కేసీఆర్ చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories