రైతు భరోసా కింద రైతులకు ఏటా రూ. 15 వేలు

అర్హులైన రైతులకు రైతుభరోసా అందించాలనే ఉద్దేశ్యంతో కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలను సేకరిస్తుంది. ఈ కమిటీని అసెంబ్లీలో చర్చకు పెట్టి రైతు భరోసాను అమలు చేస్తామని భట్టి విక్రమార్క చెప్పారు.ఈ పథకం కింద ప్రతి ఏటా రూ. 15 వేలు అందిస్తామన్నారు. గత ప్రభుత్వం రైతుబంధు కింద 80,440 కోట్లు ఖర్చు చేసిందని ఆయన గుర్తు చేశారు. ఇందులో అనర్హులు, సాగులోలేని భూ యజమానులు, రియల్ ఏస్టేట్ వ్యాపారులకు నిధులు అందాయని భట్టి విమర్శించారు. భూమిలేని రైతు కూలీలకు ప్రతి ఏటా రూ. 12 వేలు చెల్లిస్తామన్నారు.

సన్నరకం వరి సాగు చేసిన రైతులకు రూ. 500 బోనస్

సన్నరకం వరి ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 33 రకాల వరి ధాన్యాలను గుర్తించి వాటిని పండించేందుకు రైతుకు క్విటాలుకు రూ.500 బోనస్ చెల్లించనున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. దీంతో సన్నరకాల వరిని సాగు చేసే భూమి విస్తీర్ణం పెరిగి రైతులకు ఆర్ధిక ప్రయోజనం చేకూరుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories