విద్యా రంగానికి రూ.21,292 కోట్లు

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 11,062 పోస్టులతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసినట్టుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తు చేశారు. డిఎస్సీ పూర్తైతే ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల పెరుగుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీలకు వీసీల నియామకం కోసం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు యూనివర్శిటీల్లో మౌలిక వసతుల కోసం రూ. 500 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. మహిళా విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులకు రూ.100 కోట్లు కేటాయించారు.

65 ప్రభుత్వ ఐటీఐలను ప్రైవేట్ సంస్థల సహకారంతో నైపుణ్య కేంద్రాలుగా మార్చేందుకు టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఆరు కొత్త కోర్సులను ప్రవేశ పెట్టారు.ప్రతి ఏటా 5,860 మంది విద్యార్థులు ప్రతి ఏటా ఈ కోర్సుల్లో శిక్షణ పొందుతారు. స్వల్పకాల కోర్సుల్లో ప్రతి ఏటా 31,200 మంది విద్యార్థులు శిక్షణ పొందుతారు. ఇందుకు అయ్యే ఖర్చు రూ.2,324 కోట్లు, ప్రభుత్వం రూ.307.95 కోట్లు. మిగిలిన మొత్తాన్ని టాటా సంస్థ సీఎస్ఆర్ నిధుల నుంచి సమకూరుస్తుంది. ఈ పథకానికి ఈ బడ్జెట్ లో రూ. 300 కోట్లు కేటాయించింది ప్రభుత్వం.

Show Full Article
Print Article
Next Story
More Stories