ఇందిరా మహిళా శక్తి పథకం కింద రూ. 1లక్ష కోట్ల సాయం

రాష్ట్రంలోని 63 లక్షల మహిళలను విజయవంతమైన వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇందిరా మహిళా శక్తి పథకానికి రూపకల్పన చేసినట్టుగా ప్రభుత్వం తెలిపింది. స్త్రీ నిధి ఏర్పాటు, బ్యాంకులతో అనుసంధానం చేయడం ద్వారా రూ. 1లక్ష కోట్లను ఆర్ధిక సహాయం అందిస్తామని ప్రభుత్వం తెలిపింది.

మహిళలకు ఆసక్తి ఉన్న అన్ని రంగాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించనున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం ద్వారా ఏటా 5 వేల గ్రామీణ సంఘాలకు, ప్రాంతీయ స్థాయి సమాఖ్యలకు లబ్ది చేకూరేలా కార్యాచరణ చేపడుతామని ప్రభుత్వం ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories