ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ సౌకర్యాలపై మొబైల్ యాప్

విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 450 విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్లున్నాయి. అదనంగా గ్రేటర్ హైద్రాబాద్ లో 100 స్టేషన్లను ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ సౌకర్యాలను తెలుసుకొనేందుకు టీజీఈవీ మొబైల్ యాప్ ను ఏర్పాటు చేస్తున్నట్టుగా డిప్యూటీ సీఎం చెప్పారు.

సౌరశక్తి రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ట్రాన్స్, డిస్కంలకి ఈ బడ్జెట్ లో రూ. 16,410 కోట్లు ప్రతిపాదించింది రేవంత్ రెడ్డి సర్కార్. కొత్తగా 11 ఎక్స్ ట్రా హైటెన్షన్ సబ్ స్టేషన్ల నిర్మాణం, 31 ఎక్స్ ట్రా హై ఓల్టేజ్ పవర్ ట్రాన్స్ ఫార్మర్ల సామర్ధ్య పెంపు కోసం రూ.3,107 కోట్లు కేటాయించినట్టుగా డిప్యూటీ సీఎం చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories