ఆరోగ్య శ్రీ కింద రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్యం

ఆరోగ్యశ్రీ పథకం కింద రూ. 10 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో ఉన్న 1672 చికిత్సలలో 1375 చికిత్సలకు ప్యాకేజీ ధరలను సగటున 20 శాతానికి పెంచారు. అంతేకాదు ఇందులో 163 వ్యాధులను కొత్తగా చేర్చారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కలిగిన డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును జారీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టుగా భట్టి విక్రమార్క చెప్పారు. త్వరలోనే ఈఎన్టీ ఆసుపత్రిని అందుబాటులోకి తెస్తామన్నారు. వైద్య ఆరోగ్యశాఖకు ఈ బడ్జెట్ లో రూ.11,468 కోట్లు కేటాయించింది ప్రభుత్వం.

Show Full Article
Print Article
Next Story
More Stories