మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు రూ. 1500 కోట్లు

మూసీ నది నీటిని శుద్ది చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత యూకే ప్రభుత్వంతో ఈ విషయమై చర్చలు జరిపారు. హైద్రాబాద్ నగరానికి చెందిన ప్రజా ప్రతినిధులను యూకేకు తీసుకెళ్లి ప్రభుత్వం ఈ విషయమై చర్చించింది. ఈ క్రమంలోనే మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ. 1500 కోట్లు కేటాయించింది.

హైద్రాబాద్ రింగ్ రోడ్డుతో పాటు రీజినల్ రింగ్ రోడ్డు కు రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,525 కోట్లు కేటాయిస్తున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. పాతబస్తీలో మెట్రో విస్తరణకు రూ. 500 కోట్లు కేటాయించారు. మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ కు రూ. 50 కోట్లు బడ్జెట్ లో ప్రతిపాదించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories